News April 18, 2024
నరసరావుపేట TDP MP అభ్యర్థిగా లావు నామినేషన్
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్ తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేట MP స్థానానికి TDPఅభ్యర్థిగా గురువారం ఉదయం 11.20 గంటలకు లావు శ్రీకృష్ణ దేవరాయలు నామినేషన్ వేశారని అన్నారు. ఆయన మాట్లాడుతూ..
రెండు సెట్ల నామినేషన్ పత్రాలను లావు అందించారని తెలిపారు. ఎన్నికల సిబ్బంది పరిశీలించిన తరువాత నామినేషన్ స్వీకరించనున్నట్లు చెప్పారు.
Similar News
News September 30, 2024
గుంటూరు: నేటి నుంచి ఇళ్లకు ఉచిత ఇసుక
గృహాలు నిర్మించుకునే వారికి సోమవారం నుంచి గంగా ఇసుక అందుబాటులో ఉండనున్నట్లు కలెక్టర్ లక్ష్మీ తెలిపారు. పోర్టల్లో రిజిస్టర్ చేసుకొని నగదు చెల్లించి అప్లై చేసుకున్న వారికి ఉచితంగా ఇసుక ఇస్తారని చెప్పారు. సొంత వాహనం కలిగిన వారికి స్లాట్ ఇస్తున్నామని పేర్కొన్నారు. వాహనం లేని వారికి ప్రభుత్వమే సమకూరుస్తుందని, వినియోగదారులు రవాణా చార్జీలు చెల్లించి తీసుకెళ్లాల్సి ఉంటుందన్నారు.
News September 30, 2024
మంగళగిరి: నేడు ప్రయోగాత్మకంగా నైపుణ్య గణన
మంగళగిరి నియోజకవర్గంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న నైపుణ్య గణనను నైపుణ్యాభివృద్ధి సంస్థ సోమవారం నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభించనుంది. ఈ మేరకు సాంకేతిక సమస్యలను సరిదిద్దుకున్న తర్వాత ఈ సర్వేను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఒక్కో గ్రామవార్డు సచివాలయం పరిధిలో 6గురు ఉద్యోగులు పనిచేస్తారని, వారు ఇంటింటికీ వెళ్లి 25 రకాల ప్రశ్నల ద్వారా వివరాలు సేకరించి ట్యాబ్లో నమోదు చేస్తారు.
News September 30, 2024
గుంటూరులో యువకుడిపై కత్తితో దాడి
గుంటూరులో ఆదివారం రాత్రి ఓ యువకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. స్థానికుల వివరాలు.. RTCకాలనీకి చెందిన ఖాసీం మందులు కొనడానికి రాత్రి రామిరెడ్డి తోటలోని ఓ మెడికల్ షాప్కు వెళ్లాడు. అదే సమయంలో అక్కడికి మద్యం తాగి వచ్చిన ఓ గుర్తుతెలియని వ్యక్తి ఖాసీంతో గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో తన వద్ద ఉన్న చిన్న కత్తితో ఖాసీం దాడి చేశాడు. స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం GGHకు తరలించారు.