News March 11, 2025
నరసరావుపేట: దూరవిద్య ఇంటర్ పరీక్షలకు 90% హాజరు

పల్నాడు జిల్లాలో దూరవిద్య ఇంటర్మీడియట్ పరీక్షలకు 90 శాతం మంది విద్యార్థులు సోమవారం హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారిని ఎన్. చంద్రకళ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 9 సెంటర్లలో పరీక్ష నిర్వహించామన్నారు. మొత్తం 1,950 మంది విద్యార్థులకు 1,762 మంది విద్యార్థులు హాజరు అయ్యారని తెలిపారు. నరసరావుపేట సత్తెనపల్లి, వినుకొండ పరీక్షా కేంద్రాలను డీఈవో చంద్రకళ తనిఖీ చేసి, ఏర్పాట్లపై సూచనలు చేశారు.
Similar News
News December 18, 2025
ఓదెల సర్పంచ్గా డా.సతీష్ ఘన విజయం

ఓదెల గ్రామ పంచాయతీ సర్పంచ్గా డా.సతీష్ ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయనకు మద్దతుగా నిలిచిన గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్థులు డా.సతీష్కు శుభాకాంక్షలు చెప్పారు.
News December 18, 2025
పెద్దపల్లి జిల్లాలో ఉపసర్పంచ్ ఎన్నికలకు ఆదేశాలు

గ్రామ పంచాయతీల 2వ సాధారణ ఎన్నికల అనంతరం పెద్దపల్లి జిల్లాలో ఆరు గ్రామ పంచాయతీల్లో ఉపసర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ 18న కమాన్పూర్, ముత్తారం, ధర్మారం, పాలకుర్తి, అంతర్గాం మండలాల్లోని గ్రామాల్లో ఎన్నికలు జరుగుతాయి. సంబంధిత ఎంపీడీఓలు, ఎంపీపీలు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల నిబంధనలను కట్టుదిట్టంగా పాటించాలని స్పష్టం చేశారు.
News December 18, 2025
సంగారెడ్డి: ప్రశాంతంగా ఎన్నికలు అందరికీ కృతజ్ఞతలు: కలెక్టర్

సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా పూర్తవడంతో సహకరించిన అందరికీ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల సిబ్బంది, పోలీస్, పలు అధికారులు, అభ్యర్థులు, మీడియా ప్రతినిధులు, శాంతియుతంగా ఓటు హక్కు వినియోగించిన ఓటర్ల సహకారం అభినందనీయమన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రజాస్వామ్య పండుగలా విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.


