News April 21, 2025

నరసరావుపేట: విద్యార్థిగా మారిన జిల్లా కలెక్టర్

image

పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు విద్యార్థిగా మారారు. స్థానిక మున్సిపల్ బాయ్స్ హైస్కూల్‌లో తరగతుల ట్రాన్సిషన్ ప్రోగ్రాంను ప్రారంభించారు. చిన్నారులతో కలిసి ముచ్చటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి తరగతి గదిలో కూర్చున్నారు. వారితో కలిసి పాఠాలు విన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News April 21, 2025

బాపట్ల జిల్లాలో తీవ్ర ఉత్కంఠ

image

రేపు టెన్త్ ఫలితాలు విడుదల కానున్న తరుణంలో బాపట్ల జిల్లాలో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. జిల్లాలోని 103 పరీక్షా కేంద్రాల్లో 16,361 మంది రెగ్యులర్, ప్రైవేటు, మరో 438 మంది విద్యార్థులు తమ భవిష్యత్తుపై ఆశలతో పరీక్షలు రాశారు. ఇప్పుడు ఫలితాల వేళ.. ఒక్కో సెకనూ గంటలా మారింది. పరీక్షలు రాసిన విద్యార్థులు తమ ఫలితం మీద ఎన్నో ఆశలు.. లక్ష్యాలు.. పెట్టుకుని ఉన్నారు. రిజల్ట్స్ కోసం Way2News ఫాలో అవ్వండి.

News April 21, 2025

పురుషులు ఈ పదార్థాలు తింటే..

image

పురుషులు కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటే అది వారి సంతాన సాఫల్యతపై ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రాసెస్ చేయబడిన మాంసాహారాలను తింటే శుక్రకణాల నాణ్యత తగ్గుతుందని తెలిపారు. రోజూ విపరీతంగా మద్యం సేవిస్తే వీర్యం ఉత్పత్తి తగ్గిపోతుందని పేర్కొన్నారు. అలాగే సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, కొవ్వు ఎక్కువగా ఉన్న క్రీమ్, చీజ్ వంటి పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.

News April 21, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ఉష్ణోగ్రతల వివరాలు

image

ఖమ్మం జిల్లాలో సోమవారం నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ముదిగొండ (బాణాపురం)లో 41.5, నేలకొండపల్లిలో 41.3, ఎర్రుపాలెంలో 41.0, చింతకాని, మధిరలో 40.9, కామేపల్లి (లింగాల), కారేపల్లిలో 40.7, రఘునాథపాలెం, వేంసూరులో 40.3, వైరా 40.2, సత్తుపల్లి 40.0, పెనుబల్లి 39.9, ఖమ్మం అర్బన్ 39.7, తిరుమలాయపాలెం 39.4, ఖమ్మం (R) పల్లెగూడెం 39.2, తల్లాడ 38.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

error: Content is protected !!