News February 14, 2025
నర్సాపూర్ (జి): వ్యక్తిపై హత్య ప్రయత్నం కేసు నమోదు: SI

పాత కక్షలతో ఓ వివాహితను హత్య చేయడానికి ప్రయత్నించిన ఘటన గురువారం నర్సాపూర్(జి) మండల కేంద్రంలో జరిగింది. స్థానిక ఎస్సై సాయి కిరణ్ వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గడ్డం ఎల్లన్న పాత కక్షలు మనసులో పెట్టుకుని అదే గ్రామానికి చెందిన ఓ వివాహితను ఇంట్లో ఎవరూ లేని సమయంలో కత్తితో పొడిచాడు. వివాహిత భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
Similar News
News December 14, 2025
కామారెడ్డి జిల్లా 1PM UPDATE @ 77.62 శాతం

కామారెడ్డి జిల్లాలో రెండో విడత ఎన్నికల్లో భాగంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు (పోలింగ్ సమయం ముగిసే సమయానికి) 7 మండలాల్లో నమోదైన పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా ఉంది. గాంధారి-73.23%, లింగంపేట-82.20%, మహమ్మద్ నగర్-83.33%, నాగిరెడ్డిపేట-85.88%, నిజాంసాగర్-86.89%, పిట్లం-61.10%, ఎల్లారెడ్డి-87.81% పోలింగ్ నమోదైనట్లు అధికారులు చెప్పారు. మొత్తం 77.62%గా పోలింగ్ నమోదయ్యిందని వెల్లడించారు.
News December 14, 2025
NZB: ఓటు హక్కు వినియోగించుకున్న BJP జిల్లా అధ్యక్షుడు

రెండో విడుత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ NZB జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి ఆదివారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. సొంత గ్రామమైన అమృతపూర్లో ఓటు వేశారు. దినేష్ కులాచారి మాట్లాడుతా.. ఈ రోజు నా సొంత గ్రామంలో ఓటు వేయడం సంతోషంగా ఉందన్నారు. గ్రామానికి సేవ చేసే వారికీ నా మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.
News December 14, 2025
15 రోజుల్లో ‘అవుకు’ లీకేజీలకు మరమ్మతు పూర్తి : జనార్దన్ రెడ్డి

AP: నంద్యాల జిల్లా అవుకు రిజర్వాయర్ను మంత్రి జనార్దన్ రెడ్డి సందర్శించారు. ‘15 ఏళ్లుగా రిజర్వాయర్లో లీకేజీల సమస్య ఉంది. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. లీకేజీలు లేకుండా మరమ్మతు చేయిస్తున్నాం. ఇప్పటికే నిపుణులు వాటిని గుర్తించి కాంక్రీట్తో ఫిల్ చేస్తున్నారు’ అని మంత్రి తెలిపారు. ఇటీవల కట్ట కొద్దిగా కుంగడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారన్నారు. 15 రోజుల్లో పనులు పూర్తవుతాయని, భయపడొద్దని సూచించారు.


