News February 7, 2025

నర్సీపట్నం యాక్సిడెంట్‌లో మరణించిన ఉద్యోగి వివరాలు 

image

నర్సీపట్నంలో శుక్రవారం ఉదయం బస్సు కిందపడి <<15385488>>మరణించిన <<>>ఫారెస్ట్ ఉద్యోగి వివరాలు తెలిసాయి. కొయ్యూరు మండలం మర్రుపాక సెక్షన్ ఆఫీసర్‌గా ఆర్.పుట్టన్న విధులు నిర్వహిస్తున్నారు. నర్సీపట్నంలో నివాసముండే పుట్టన్నకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం విధులకు బయలుదేరిన పుట్టన్న రోడ్డు ప్రమాదంలో మరణించడం అందరిలో విషాదం నిలిపింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బంది విచారణ వ్యక్తం చేశారు.

Similar News

News February 7, 2025

వివేకా కేసులో జగన్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?: దస్తగిరి

image

AP: వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని కడపలో విచారణ అధికారి 3గంటల పాటు ప్రశ్నించారు. గతేడాది జైలులో తనను ఇబ్బందులు పెట్టారని ఆయన ఇటీవల ఫిర్యాదు చేయగా విచారణకు పిలిచారు. దస్తగిరి మాట్లాడుతూ.. ‘వివేకా హత్య కేసులో జగన్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు. ఈ కేసులో త్వరలోనే నిజాలు బయటకు వస్తాయి. కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని భావిస్తున్నా. ప్రభుత్వానికి ఈ కేసు సవాల్ లాంటిది’ అని అన్నారు.

News February 7, 2025

ఆసిఫాబాద్: ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

image

జిల్లా ప్రధాన ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మందుల పంపిణీ పై సమాచారం తీసుకున్న తర్వాత ఆస్పత్రిలో ప్రసవాల గురించి ఆరా తీశారు. 

News February 7, 2025

ఆసిఫాబాద్: రాజకీయ పార్టీలు సహకరించాలి: కలెక్టర్  

image

ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే కోరారు. శుక్రవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలిసి హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో జరిగేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలన్నారు.

error: Content is protected !!