News March 16, 2025
నల్గొండ: DCCలకు పదవులు.. అధ్యక్ష పీఠంపై ఇంట్రస్ట్

డీసీసీ పదవికి భారీగా డిమాండ్ పెరిగింది. నల్గొండ DCCగా ఉన్న శంకర్ నాయక్కు ఎమ్మెల్సీగా అవకాశం దక్కడంతో ఆ పదవికి పలువురు పోటీ పడుతున్నారు. సూర్యాపేట డీసీసీగా ఉన్న వెంకన్నను రైతు కమిషన్ సభ్యుడిగా నియమించింది. దీంతో ఇక్కడ కూడా డీసీసీ అధ్యక్ష పదవిపై పలువురి దృష్టి పడింది. సూర్యాపేట స్థానాన్ని జనరల్, యాదాద్రి జిల్లాకు ఎస్సీ లేదా జనరల్ కోటాలో భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు చర్చ నడుస్తోంది.
Similar News
News March 16, 2025
హోలీ రంగుల్లో షమీ కూతురు.. ముస్లిం పెద్ద ఆగ్రహం

పేసర్ షమీ కూతురు ఐరా హోలీ రంగుల్లో కనిపించడంతో ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు రజ్వీ మండిపడ్డారు. షరియాలో లేని పనులు పిల్లలు చేయడాన్ని అనుమతించొద్దని షమీ, కుటుంబ సభ్యులకు సూచించారు. హోలీ హిందువుల పండుగ అని, ముస్లింలు చేసుకోవద్దన్నారు. షరియా తెలిసిన వారు హోలీ సెలబ్రేట్ చేసుకోవడం నేరమని చెప్పారు. ఇటీవల <<15669090>>షమీ<<>> ఉపవాసం ఉండకపోవడంపై రజ్వీ తీవ్రవ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
News March 16, 2025
నా బలం నా పేరులో లేదు: మోదీ

‘నా బలం నా పేరులో లేదు. 140 కోట్ల ప్రజల మద్దతు, దేశ సంస్కృతి, వారసత్వంలో ఉంది’ అని ప్రధాని మోదీ చెప్పారు. తనకు షేక్ హ్యాండ్ ఇవ్వడం అంటే దేశ ప్రజలందరికీ ఇచ్చినట్లేనని తెలిపారు. ఒక ఉద్దేశ్యంతో గొప్ప శక్తి తనను ఇక్కడి(భూమి)కి పంపిందని, తానెప్పుడూ ఒంటరి కాదన్నారు. బాల్యంలో తన తండ్రి టీ షాపు వద్దకు వచ్చిన వారి నుంచి చాలా నేర్చుకునేవాడినన్నారు. వాటినే ప్రజా జీవితంలో అప్లై చేసినట్లు పేర్కొన్నారు.
News March 16, 2025
చిత్తూరు: 10 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి అయినట్టు ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి ఆదివారం తెలిపారు. మొత్తం 118 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రెగ్యులర్ విద్యార్థులు 20, 954 మంది, ప్రైవేటు విద్యార్థులు 294 మంది పరీక్షకు హాజరవుతున్నట్టు చెప్పారు. పరీక్షా కేంద్రాల్లోనికి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు. పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.