News March 21, 2025

నల్గొండ: DSPకి ప్రశంసా పత్రం

image

రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేసినందుకు గాను నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన రోడ్డు భద్రత సమావేశంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ చేతుల మీదుగా ఆయన ఈ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. దీంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని డీఎస్పీ అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ సహకరించాలని సూచించారు.

Similar News

News March 31, 2025

నాంపల్లి: జాతీయ కమిషన్ సభ్యుడిగా శ్రీనివాస్ నియామకం

image

నిజాం వైద్య విజ్ఞాన సంస్థ, వైద్య అనుబంధ వృత్తి విజ్ఞాన కళాశాల ప్రిన్సిపల్ నాంపల్లి మండల కేంద్రానికి చెందిన శిరందాసు శ్రీనివాస్ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, వైద్య అనుబంధ వృత్తుల జాతీయ కమిషన్ సభ్యుడిగా ఎన్నికైయ్యారు. పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని నిరూపించారు. ఉన్నత శిఖరాలు అధిరోహించిన శిరందాసు శ్రీనివాస్‌కి నాంపల్లి మండల ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు.

News March 30, 2025

NLG: జిల్లా ప్రజలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉగాది విషెష్

image

తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని నల్గొండ జిల్లా ప్రజలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో జిల్లా ప్రజలకు అన్ని శుభాలు కలగాలని.. సుభిక్షంగా ఉండాలని పల్లెల్లో పట్టణాల్లో ప్రతి ఇల్లు కళకళలాడాలని పేర్కొన్నారు. షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని అభిలాషించారు.

News March 30, 2025

నేడు సన్నబియ్యం పథకం ప్రారంభం.. ఫస్ట్ వీరికే!

image

రాష్ట్రంలో ఉగాది పర్వదినం సందర్భంగా పేదలకు సన్నబియ్యం పథకాన్ని హుజూర్‌నగర్‌ వేదికగా CM రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. మొదటగా పట్టణంలోని రేషన్ కార్డుదారులు ధరావత్ బుజ్జీ, కర్ల రాధ, రజిత, సుశీల, షేక్ కరీమా, మమత, సుగుణ, కర్నా వెంకటపుష్ప, సరికొండ ఉమ, మండల పరిధిలోని చడపండు లక్ష్మి, భరతం కుమారి, కర్పూరపు లక్ష్మి, మాళోతు రంగా, గుండెబోయిన గురవయ్య, షేక్ రహిమాన్‌కు CM రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నారు.

error: Content is protected !!