News June 29, 2024

నల్గొండ జిల్లాలో పడిపోతున్న బీఆర్‌ఎస్..!

image

బీఆర్‌ఎస్ బలం ఉమ్మడి నల్గొండ జిల్లాలో అంతకంతకూ పడిపోతోంది. ఐదేళ్ల క్రితం జరిగిన సర్పంచ్, MPTC, ZPTCఎన్నికల్లో అత్యధికం BRS కైవసం చేసుకుంది. పురపాలిక ఎన్నికల్లోనూ 19 పురపాలికల్లో అన్నింట్లోనూ ఆ పార్టీకి చెందిన వారే ఛైర్మన్‌లుగా గెలిచారు. 3 ZPలను సైతం కైవసం చేసుకుంది. ప్రస్తుతం కేవలం SRPT, NKL, పోచంపల్లి, చండూరులో మాత్రమే BRS‌కుచెందిన వారు ఛైర్మన్‌లుగా ఉండగా..మిగతా చోట్లా కాంగ్రెస్‌ వారు ఉన్నారు.

Similar News

News September 21, 2024

కేతేపల్లి: భూమి పట్టా చేయనందుకే హత్య

image

ఈనెల 17న కేతేపల్లి మండలం <<14128705>>చెర్కుపల్లిలో దారుణ హత్య <<>>జరిగిన విషయం తెలిసిందే. సీఐ కొండల్ రెడ్డి వివరాల ప్రకారం.. పిట్టల సైదులు పేరు మీద ఉన్న 2ఎకరాల భూమి పట్టాచేయాలని కొడుకు నవీన్, భార్య ప్రమీల ఒత్తిడి తెచ్చారు. సైదులు అందుకు నిరాకరించడంతో ప్రమీల, నవీన్ కలిసి రోకలి బండతో హత్య చేసినట్లు తెలిపారు. నిందితులు మండలంలోని కొండకిందిగూడెం శివారులో సంచరిస్తుండగా అరెస్టు చేశామన్నారు.

News September 21, 2024

నాగార్జునసాగర్ జలాశయం తాజా సమాచారం

image

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గడంతో అన్ని గేట్లు మూసివేశారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.80 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుతం 311.7462 టీఎంసీల నీరుంది. ఔట్ ఫ్లో: 31,196 క్యూసెక్కులు కాగా, ఇన్ ఫ్లో: 31,196 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు.

News September 21, 2024

మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్‌గా ఎంపికైన సిద్దిసముద్రంతండా వాసి

image

తిరుమలగిరి మండలం సిద్ది సముద్రం తండాకు చెందిన ధరావత్ సాయిప్రకాష్ శుక్రవారం ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని పంజాబ్ రాష్ట్రానికి ఎంపికయ్యాడు. సాయి ప్రకాష్ చిన్నతనం నుంచే చదువులో ముందు ఉండేవాడు. ఇంటర్ పూర్తికాగానే హైదరాబాద్లోని సివిల్స్ సర్వీస్ కోచింగ్ సెంటర్‌లో శిక్షణ మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్‌గా ఎంపికయ్యాడు. దీంతో తండావాసులు సాయి ప్రకాష్ కు అభినందనలు తెలిపారు.