News February 1, 2025
నల్గొండ: రాజకీయ పార్టీల నేతలతో సమావేశం

నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ ఛాంబర్లో జిల్లాలోని రాజకీయ పార్టీ నేతలతో శనివారం సమావేశాన్ని నిర్వహించారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహించనున్నారు. పోలింగ్ స్టేషన్ల ఖరారుకు సంబంధించిన ఏర్పాట్ల వివరాలు పై రాజకీయ పార్టీల నేతలతో సమావేశాన్ని నిర్వహించారు. అభ్యంతరాలు ఉంటే వ్యక్తం చేయాలని రాజకీయ నేతలకు అధికారులు తెలిపారు.
Similar News
News March 7, 2025
NLG: రేపు జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్

జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ వారి ఆదేశాల మేరకు ఈనెల 8న జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టు ప్రాంగణాలలో జాతీయ లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షుడు & ప్రధాన జిల్లా న్యాయమూర్తి ఎం. నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులందరూ వినియోగించుకొని తమ కేసులు రాజీ చేసుకోగలరని సూచించారు.
News March 7, 2025
REWIND: ఎలిమినేటిని హిట్ లిస్ట్లో పెట్టి చంపేశారు!

<<15677348>>ఎలిమినేటి <<>>1985లో తొలిసారి భువనగిరి MLAగా ఎన్నికై ఆ తర్వాత చంద్రబాబు కేబినెట్లో హోం మినిస్టర్ అయ్యారు. TDPప్రభుత్వం నక్సల్స్పై నిషేధాస్త్రం ప్రయోగిచడంతో స్టేట్లో అనేక ఎన్కౌంటర్లు జరిగాయి. గద్దర్పై కాల్పులు..బెల్లి లలిత హత్య, పీపుల్స్వార్ అగ్రనేతలు ఎర్రంరెడ్డి సంతోష్రెడ్డి,నల్లా ఆదిరెడ్డి, శీలం నరేశ్ ఎన్కౌంటర్లు జరగడంతో మాధవరెడ్డిని పీపుల్స్వార్ గ్రూపు తన హిట్లిస్ట్లో చేర్చి చంపింది.
News March 7, 2025
నల్గొండ: బీసీ గురుకులాలలో ప్రవేశాలు

మహాత్మ జ్యోతిరావ్ ఫులే బీసీ గురుకుల సంక్షేమ పాఠశాలలో 6, 7, 8, 9వ తరగతులలో బ్యాక్ లాక్ సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి నల్గొండ జిల్లా కో-ఆర్డినేటర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని గురుకులాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థులు ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.