News March 17, 2025

నల్గొండ: రాముడి ఆలయ నిర్మాణానికి ముస్లిం వ్యక్తి విరాళం

image

నల్గొండ ప్రజలు భిన్నత్వంలో ఏకత్వం సూత్రం పాటిస్తారని మరోసారి రుజువు చేశాడు ఆ వ్యక్తి.. నల్గొండ జిల్లా నాంపల్లిలో నూతనంగా శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం నిర్మిస్తున్నారు. కాగా ఈ ఆలయ నిర్మాణానికి నాంపల్లి మండలం తిరుమలగిరి వాసి మహమ్మద్ రవూఫ్ చోటే తన వంతు సాయంగా రూ.60,000 విరాళంగా అందజేశారు. దీంతో దేవాలయ కమిటీ ఛైర్మన్ కోట రఘునందన్, కమిటీ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News March 18, 2025

సూర్యాపేట: ప్రజావాణి కార్యక్రమానికి 62 దరఖాస్తులు

image

ప్రజవాణిలో సరైన రీతిలో అర్జీదారులకు సమాధానమిస్తూ పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజావాణిలో మొత్తం 62 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసాలకోర్చి వచ్చే ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కారమయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. 

News March 18, 2025

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్లు వేగవంతం చేయండి: సూర్య

image

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య తేజ వారాంతపు సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సోమవారం ఇంజనీరింగ్, హౌసింగ్, టిడ్కో విభాగాల వారితో మీటింగ్ నిర్వహించారు. ఎల్&టి ఇంజనీరింగ్ కంపెనీ వారికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్లు వేగవంతంగా కొనసాగేలా చర్యలు చేపట్టాలని ప్రతినిధులకు తెలిపారు. నగర ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించాలన్నారు.

News March 18, 2025

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి: కమిషనర్ 

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి వహించారని కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమాన్ని పురస్కరించుకొని కౌన్సిల్ హాల్లో ప్రజల నుంచి వినుతులు స్వీకరించారు. స్వీకరించిన ఫిర్యాదులలో ఎక్కువగా టౌన్ ప్లానింగ్ 46, ఇంజినీరింగ్ విభాగం నుంచి 24 ఫిర్యాదులు రాగా.. హెల్త్ శానిటేషన్ 4, ప్రాపర్టీ టాక్స్ 10, మంచినీటి సరఫరా 4.. మొత్తం 88 అప్లికేషన్లు వచ్చాయి.

error: Content is protected !!