News February 18, 2025
నల్గొండలో రౌడీషీటర్ అరెస్ట్

NLGలోని రాక్ హిల్స్ కాలనీకి చెందిన రౌడీషీటర్ రాజేశ్ను అరెస్టు చేసినట్లు NLG డీఎస్పీ శివ రాంరెడ్డి సోమవారం తెలిపారు. ఇతనిపై సుమారు 17 హత్యకేసులు ఉన్నట్లు తెలిపారు. పట్టణంతో పాటు ఎల్బీనగర్ ఏరియాను అడ్డాగా చేసుకొని భూసెటిల్మెంట్లు, గంజాయి మత్తులో పలువురికి ఫోన్లు చేసి బెదిరిస్తుండటంతో బాధితుల ఫిర్యాదుతో అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు.
Similar News
News March 15, 2025
జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలి: BRS ఎమ్మెల్యేలు

TG: ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో హరీశ్ రావు, తలసాని, మాధవరం కృష్ణారావు, సబితారెడ్డి, సుధీర్ రెడ్డి, వివేకానంద ఆయనను కలిశారు. జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ అన్యాయమని వారు పేర్కొన్నారు. స్పీకర్ను ఏకవచనంతో పిలవలేదని, సభా సంప్రదాయాలను ఆయన ఉల్లంఘించలేదని వారు తెలిపారు.
News March 15, 2025
MDK: అలర్ట్.. పిల్లలపై కన్నేసి ఉంచండి

మెదక్ జిల్లా వ్యాప్తంగా వేసవి తాపం నేపథ్యంలో నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు ఉంటాయి. ఒంటిపూట బడులు అంటే పిల్లలకు సరదా.. చెరువుల్లో, నీటి వనరుల వద్దకు వెళ్తుంటారు. చిన్నారులు నీట మునిగి మృత్యువాత పడిన ఘటనలు ఎన్నో జరిగాయి. చెరువులు, కుంటలు, బావులు నీటితో నిండి ఉన్నాయి. పిల్లల మీద పెద్దలు ఓ కన్నేసి ఉంచండి. SHARE IT..
News March 15, 2025
పెంటపాడు: ఐరన్ ప్లేట్ మీద పడి వ్యక్తి మృతి

బరువైన ఐరన్ ప్లేట్ మీద పడటంతో వ్యక్తి మృతి చెందిన ఘటన పెంటపాడు(M) ప్రత్తిపాడులో జరిగింది. ఎస్సై స్వామి తెలిపిన వివరాల మేరకు.. తాడేపల్లిగూడెంలోని యాగర్లపల్లికి చెందిన షేక్ మస్తాన్(38) ఈ నెల 13న ప్రత్తిపాడులోని ఓ పేపర్ మిల్లులో ఇనుప వస్తువులు తొలగించే పని మీద వెళ్లాడు. ఆ సమయంలో మస్తాన్పై బరువైన ఇనుప ప్లేట్ పడటంతో మృతి చెందాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో శుక్రవారం మధ్యాహ్నం వరకు విషయం ఎవరికీ తెలియరాలేదు.