News October 3, 2024
నవరాత్రులు పూర్తి అయ్యేవరకు 30 పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ
శ్రీ సత్యసాయి జిల్లాలో నవరాత్రులు పూర్తి అయ్యేవరకు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. నవరాత్రులు పూర్తి అయ్యేవరకు జిల్లాలో డీజేలు, డాన్సులు, బాణసంచా కాల్చడం, ఊరేగింపులు పూర్తిగా నిషేధం విధించామన్నారు. 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని, ఎవరు అతిక్రమించినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News October 3, 2024
100 రోజుల కార్యాచరణ ప్రణాళిక లక్ష్యాన్ని 30 నాటికి సాధించాలి: కలెక్టర్
స్వర్ణాంధ్ర-2047 విజన్కు సంబంధించి జిల్లా, మండల కార్యాచరణ ప్రణాళికల రూపకల్పనకు అధికారులు కృషి చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో వంద రోజులు ప్రణాళికపై, వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనలో ప్రధాన అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సరించాలన్నారు.
News October 3, 2024
సెలవులలో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు: డీఈఓ
దసరా సెలవులలో పాఠశాలలు, కళాశాలలో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీ సత్యసాయి జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి తెలిపారు. నేటి నుంచి 13వ తేదీ వరకు పాఠశాలలకు సెలవు ప్రకటించామని, నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా తరగతులు నిర్వహిస్తే యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల విద్యాశాఖ అధికారులు పాఠశాలలను సందర్శించి నివేదికను ఉన్నతాధికారులకు అందజేయాలన్నారు.
News October 3, 2024
లేబర్, టెక్స్ టైల్స్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా అనంతపురం ఎంపీ
అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు కేంద్ర ప్రభుత్వం లేబర్, టెక్స్ టైల్స్, స్కిల్ డెవలప్మెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా అవకాశం కల్పించింది. ఈ అవకాశం కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు అంబికా లక్ష్మీనారాయణ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.