News April 22, 2025
నా రాజకీయ నిర్ణయం సరైనదే: ఎమ్మెల్యే తెల్లం

నియోజక అభివృద్ధి కోసం తాను తీసుకున్న రాజకీయ నిర్ణయం సరైనదేనని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. దుమ్ముగూడెం మండలంలో పర్యటించి మాట్లాడారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రజలకు చేసిందేమిలేదని విమర్శించారు. భద్రాచలం అభివృద్ధికి రూ. 100 కోట్లు నిధులిస్తామని ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యారన్నారు. భద్రాద్రికి అభివృద్ధికి తొలి విడతగా కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 34 కోట్లు మంజూరు చేసిందన్నారు.
Similar News
News April 22, 2025
వరంగల్: ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి

వరంగల్ జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం వార్షిక ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. ఫస్ట్ ఇయర్లో మొత్తం 4967 మంది పరీక్షలు రాయగా 2890 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 58.18 శాతం నమోదైంది. ఇందులో బాలికలు మొత్తం 2989 మందికి గాను 2039(68.22%) ఉత్తీర్ణులయ్యారు. బాలురులో మొత్తం 1978 మందికి గాను 851 మంది (43.02%) ఉత్తీర్ణులయ్యారు.
News April 22, 2025
వరంగల్: సెకండ్ ఇయర్ లోనూ వారే ముందజ!

వరంగల్ జిల్లాలో ఇంటర్ సెకండియర్ ఫలితాల్లోనూ బాలికలదే పైచేయి. మొత్తం 4743మంది పరీక్షలు రాయగా 3292(69.41%) మంది పాసయ్యారు. బాలికలు మొత్తం 2877 మందికి గాను 2263(78%) ఉత్తీర్ణులయ్యారు. బాలురులో మొత్తం 1866 మంది విద్యార్థులకు గాను 1029మంది(55.14%) ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా ఒకేషనల్లో బాలికలు 431 మంది విద్యార్థులకు గాను 347(80.51%) మంది.. బాలురు 227 మందికి 70(30.84%) మంది పాసయ్యారు.
News April 22, 2025
UPDATE: ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఎంతమంది పాసంటే?

ఇంటర్ మొదటి సంవత్సరం జనరల్ కోర్సులో మొత్తం 15,056 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 8,035 మంది ఉత్తీర్ణులు అయినట్లు DIEO తెలిపారు. వీరిలో బాలికలు 8,074 మంది హాజరు కాగా 5,191 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 6,982 మంది పరీక్షలకు హాజరు కాగా 2,844 మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులు మొత్తం 2,790 మంది పరీక్షలకు హాజరుకాగా 1,223 ఉత్తీర్ణులయ్యారని వివరించారు.