News November 29, 2024
నాగర్ కర్నూల్: మధ్యాహ్న భోజనం తిని నలుగురు విద్యార్థుల అస్వస్థత

మరో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాలు.. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలోని గోరిట ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని శుక్రవారం నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. టమాటా రైస్, గుడ్డు తిన్న నలుగురు విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో వెంటనే స్పందించిన ఉపాధ్యాయులు వైద్యులను పాఠశాలకు పిలిపించి అక్కడే చికిత్స అందించారు. ఈఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 19, 2025
ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు

✒MBNR:T-20 క్రికెట్ లీగ్.. షెడ్యూల్ విడుదల
✒సౌత్ జోన్.. 22న ‘ఫుట్ బాల్’ ఎంపికలు
✒MBNR: పాత బకాయిలు ఇస్తేనే సర్వే చేస్తాం: ఆశా వర్కర్లు
✒NGKL: వ్యవసాయ పొలాల్లో పెద్దపులి జాడలు
✒సౌత్ జోన్..రేపు షటిల్,బ్యాడ్మింటన్ ఎంపికలు
✒జాతీయస్థాయి ఖో-ఖో టోర్నికి పాలమూరు విద్యార్థిని
✒MBNR:ఈనెల 21న..U-19 కరాటే ఎంపికలు
✒ఓపెన్ SSC,INTER దరఖాస్తుకు గడువు పెంపు
News December 19, 2025
MBNR: సౌత్ జోన్.. 22న ‘ఫుట్ బాల్’ ఎంపికలు

మహబూబ్ నగర్ లోని పాలమూరు వర్సిటీ నుంచి సౌత్ జోన్ ఆలిండియా పోటీల్లో పాల్గొనే ‘ఫుట్ బాల్’ (పురుషుల) జట్ల ఎంపికలను ఈ నెల 22న నిర్వహించనున్నట్లు వర్సిటీ పీడీ డా. వై.శ్రీనివాసులు ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. వయస్సు 17-25 ఏళ్లలోపు ఉండాలని, క్రీడాకారులు బోనఫైడ్, టెన్త్ మెమో, ప్రిన్సిపల్ సంతకంతో కూడిన ఎలిజిబిలిటీ ఫామ్ తీసుకురావాలన్నారు. ఎంపికలు మహబూబ్ నగర్ లోని స్టేడియం గ్రౌండ్లో ఉంటాయన్నారు.
News December 19, 2025
పాలమూరు: ఈనెల 21న.. U-19 కరాటే ఎంపికలు

మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-19 బాల, బాలికలకు కరాటే ఎంపికలను ఈనెల 21న మహబూబ్ నగర్ లోని డీఎస్ఏ స్టేడియం గ్రౌండ్స్ నిర్వహిస్తున్నట్లు SGF కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ఆసక్తిగల జిల్లా క్రీడాకారులు ఒరిజినల్ టెన్త్ మెమో, బోనఫైడ్, ఆధార్ కార్డు పత్రాలు తీసుకొని ఉదయం 9 గంటలలోపు రిపోర్ట్ చేయాలన్నారు.
SHARE IT


