News April 16, 2025

నాగర్‌కర్నూల్: ఆ టీచర్‌కు షోకాజ్ నోటీసులు

image

నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని నాగనూలు కస్తూర్బా పాఠశాల ఉపాధ్యాయిని కళ్యాణికి ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. రెండు రోజుల క్రితం 9వ తరగతి చదువుతున్న యామిని ఆలస్యంగా వచ్చిందని సదరు టీచర్ మందలించి 3 గంటలు పనిష్మెంట్ ఇచ్చింది. మనస్తాపానికి గురైన యామిని ఆత్మహత్యకు యత్నించింది. విద్యార్థినులు మంగళవారం పాఠశాల ముందు ఆందోళన చేశారు. స్పందించిన అధికారులు టీచర్‌కు షోకాజ్ నోటీసులు పంపారు.

Similar News

News April 17, 2025

స్విమ్మింగ్ పూల్ నిర్మాణ పనులు పూర్తి చేయండి: మేయర్

image

వేగవంతంగా స్విమ్మింగ్ పూల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని వరంగల్ మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో ఇండోర్ స్టేడియం ప్రాంతంలో సుమారు రూ.1.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న స్విమ్మింగ్ ఫూల్ నిర్మాణ పనులను మేయర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనులు కొనసాగుతున్న తీరు పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో జాప్యం సరికాదన్నారు.

News April 17, 2025

మహా ముత్తారం అడవిలో పెద్దపులి సంచారం.. క్లారిటీ

image

మహా ముత్తారం మండలంలో పెద్దపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. అడవిలో పులి సంచరిస్తుందని ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో అటవీ సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఈ విషయమై అధికారులను Way2News వివరణ కోరగా.. గతంలో సంచరించిన పులి అడుగుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని, మండలంలో పులి సంచారం లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు భయాందోళనకు గురికావద్దని సూచించారు.

News April 17, 2025

టేక్మాల్: బైక్ యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

టేక్మాల్ మండలం లక్ష్మన్ తండాకు చెందిన పొమ్లా నాయక్ బైక్ ఢీకొని మృతి చెందాడు. పోలీసుల వివరాలు.. టేక్మాల్‌కు చెందిన తలారి సతీశ్ తన బైక్‌తో ఎలకుర్తి గ్రామ శివారులో పొమ్లా నాయక్‌ను వెనకనుంచి బలంగా ఢీ కొట్టాడు. దీంతో పొమ్లా రోడ్డుపై పడి తీవ్ర గాయాలు కావడంతో మెదక్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ దయానంద్ తెలిపారు.

error: Content is protected !!