News March 19, 2025

నాగర్‌కర్నూల్ జిల్లాకు ఎల్లో WARNING

image

నాగర్‌కర్నూల్ జిల్లాకు హైదరాబాద్ వాతావరణ శాఖ మంగళవారం ఎల్లో వార్నింగ్ జారీ చేసింది. మంగళవారం జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో 36 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను నమోదయ్యాయని వాతావరణ శాఖ నివేదిక పేర్కొంది. రాబోయే రెండు, మూడు రోజుల వరకు జిల్లాలో సుమారు 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Similar News

News March 20, 2025

IPL ట్రోఫీ కోసం PBKS ప్రత్యేక పూజలు!

image

మరో రెండ్రోజుల్లో IPL మొదలు కానుండటంతో అన్ని జట్లు సమరానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాయి. అయితే పంజాబ్ కింగ్స్ జట్టు ఈసారి కప్ తమకే రావాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించింది. టీమ్ కోచ్ రికీ పాంటింగ్, కోచింగ్ సిబ్బంది, ప్లేయర్లంతా కలిసి పూజలో పాల్గొన్నారు. 2008 నుంచి ఆడుతున్నప్పటికీ పంజాబ్ ఒక్కసారి కూడా ట్రోఫీ అందుకోలేదు. మరి పూజతోనైనా జట్టు తలరాత మారుతుందో చూడాలి.

News March 20, 2025

రేవంత్‌కు పర్సెంటేజీలపైనే ఇంట్రెస్ట్: కేటీఆర్

image

TG: రేవంత్ రెడ్డి జాక్ పాట్ సీఎం అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. ‘ఆయనకు అదృష్టం బాగుంది.. పర్సనాలిటీ పెంచుకుంటారనుకున్నా. అయితే పర్సెంటేజీలపైనే రేవంత్‌కు ఆసక్తి ఉంది. ఢిల్లీకి మూటలు పంపి పదవి కాపాడుకోవడంపై దృష్టి పెట్టారు’ అని విమర్శించారు. సూర్యాపేట సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు ఫీనిక్స్ ప‌క్షిలా పోరాటం చేస్తున్నార‌ని KTR ప్రశంసించారు.

News March 20, 2025

2026 మార్చి 31నాటికి ‘నక్సల్స్‌రహిత భారత్’: అమిత్ షా

image

వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకల్లా భారత్ మావోయిస్టురహిత దేశంగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ‘ఈరోజు ఛత్తీస్‌గఢ్‌లో 22మంది నక్సల్స్‌ని మన సైనికులు అంతం చేశారు. ఈ క్రమంలో ‘నక్సల్ రహిత భారత్‌’ దిశగా మరో విజయాన్ని సాధించారు. ప్రభుత్వం ఎన్ని అవకాశాలిచ్చినా లొంగిపోని నక్సలైట్లపై జాలి చూపే ప్రసక్తే లేదు. మా ప్రభుత్వం వారిపై అత్యంత కఠిన వైఖరిని అవలంబిస్తోంది’ అని పేర్కొన్నారు.

error: Content is protected !!