News April 12, 2025

నాగర్‌కర్నూల్ జిల్లాకు చేరిన 35,710 పాఠ్యపుస్తకాలు 

image

NGKL జిల్లాలోని జిల్లా పరిషత్, మండల పరిషత్, ఆదర్శ, గురుకుల, కేజీబీవీ కలుపుకొని 939 పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాలల్లో 72,641 విద్యార్థులున్నారు. వారికి ఆరు లక్షల వరకు పాఠ్యపుస్తకాలు అవసరమవుతాయి. 2026-26 విద్యా సంవత్సరానికి గాను ముందస్తుగా 35,710 పాఠ్యపుస్తకాలు జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి మిగతా పుస్తకాలు అందుతాయని డీఈవో రమేశ్ కుమార్ తెలిపారు.

Similar News

News April 19, 2025

మాదకద్రవ్యాల రవాణాను అరికట్టాలి: హోం మంత్రి

image

గంజాయి మాదకద్రవ్యాల రవాణాను అరికట్టాలని పోలీస్ అధికారులను హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. శనివారం గుంటూరు రేంజ్ పరిధిలో గుంటూరు ఐజీ కార్యాలయంలో శనివారం శాంతిభద్రతలు పరిరక్షణ ట్రాఫిక్ నిబంధనలు మాదకద్రవ్యాల నియంత్రణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించినట్లు మంత్రి ఎక్స్ లో పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాల కట్టడికి పోలీసులు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.

News April 19, 2025

వ్యక్తిగత ప్రయోజనాలకే వైసీపీ పరిమితం: విశాఖ ఎంపీ 

image

వ్యక్తిగత ప్రయోజనాలకే వైసీపీ ప్రభుత్వం పరిమితమైందని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. శనివారం జీవీఎంసీ మేయర్ అవిశ్వాస తీర్మాన ఓటింగ్‌లో కూటమి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో కలిసి ఎంపీ శ్రీభరత్ పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జీవీఎంసీలో అభివృద్ధి పరంగా ఎలాంటి పురోగతి జరగలేదన్నారు. రానున్న రోజుల్లో కూటమి నాయకత్వంలో జీవీఎంసీని పూర్తిగా ప్రజల అభివృద్ధికి కేటాయించబోతున్నామన్నారు.

News April 19, 2025

నిజామాబాద్: లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ: కలెక్టర్

image

జిల్లాలో లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ సాగుతోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై పౌర సరఫరాల శాఖ కమిషనర్ చౌహాన్, సంబంధిత మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష జరిపారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి గురించి కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం సేకరణ జరుగుతుందని వివరించారు.

error: Content is protected !!