News April 6, 2025

నాగర్‌కర్నూల్ జిల్లాలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లోని సింగోటం క్రాస్ రోడ్డు వద్ద జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. పెంట్లవెల్లి వాసి గార్డుల లేవన్న(45) పనిమీద పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్‌కి వెళ్లాడు. తిరిగొస్తుండగా శనివారం రాత్రి కొల్లాపూర్‌లోని సింగోటం క్రాస్ రోడ్డు ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని రాంగ్ రూట్లో వెళ్లి బైక్‌తో ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

Similar News

News April 9, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!

image

✔వక్స్ బిల్లు.. ముస్లింల భారీ నిరసన ర్యాలీ✔గద్వాలలో గుర్తుతెలియని మృగం కలకలం✔ప్రతి గింజను కొనుగోలు చేయండి: కలెక్టర్లు✔సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ✔వచ్చే విద్యా సంవత్సరానికి ఏకరూప దుస్తులు సిద్ధం: డీఈవోలు✔గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలి: CPM✔PUలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ✔పలుచోట్ల చలివేంద్రాలు ప్రారంభం✔వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం✔SLBCలో ముమ్మరంగా మట్టి, స్టీల్ తొలగింపు.

News April 9, 2025

మలేరియా రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి: కలెక్టర్

image

జిల్లాలోని మలేరియా రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ వైద్యాధికారులను ఆదేశించారు. గతంలో కంటే తీవ్రంగా ప్రస్తుత మలేరియా ఉంటుందని వైద్యాధికారులు తెలిపిన నేపథ్యంలో వారికి అవసరమైన చికిత్సను అందించడంతో పాటు తగినంత నీరు, ఆహారాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధిత శాఖల సహకారం తీసుకోవాలని సూచించారు. మంగళవారం సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో సమీక్షించారు.

News April 9, 2025

HYD: MMTS మహిళా బోగీల్లో సీసీ కెమెరాలు

image

HYDలోని నాలుగైదు MMTS ట్రెన్లలోనే సీసీ కెమెరాలు ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మహిళల భద్రత కోసం త్వరలో అన్ని MMTS ట్రెయిన్లలోని మహిళా బోగీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే MMTS స్టేషన్లలో కూడా కెమెరాల ఏర్పాటుపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు, రైల్వే పోలీసులు పరిశీలిస్తున్నారు.

error: Content is protected !!