News April 6, 2025

నాగర్‌కర్నూల్: ‘దరఖాస్తు చేసుకోండి.. మీ కోసమే ఇది’

image

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని నాగర్‌కర్నూల్ జిల్లాలోని బీసీ, అత్యంత వెనుకబడిన తరగతుల ఈ.బీ.సీ నిరుద్యోగ యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ, అభివృద్ధి శాఖ అధికారి అలీ అప్సర్ సూచించారు. వివిధ రకాల వ్యాపారాలను నిర్వహించేందుకు దీనికి దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. 

Similar News

News April 18, 2025

మరోసారి మొబైల్ టారిఫ్స్ పెంపు?

image

టెలికాం కంపెనీలు మరోసారి మొబైల్ టారిఫ్స్ పెంచబోతున్నట్లు మనీకంట్రోల్ తెలిపింది. ఈ ఏడాది చివర్లో 10-20% పెంపు ఉండబోతున్నట్లు పేర్కొంది. నవంబర్-డిసెంబర్ నెలల్లో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు రీఛార్జ్ ధరల పెంపును ప్రకటించే అవకాశం ఉందని వెల్లడించింది. ARPU వృద్ధి, మూలధనంపై మెరుగైన రాబడి కోసం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా గత జులైలోనే టెలికామ్ సంస్థలు టారిఫ్లను పెంచాయి.

News April 18, 2025

క్రికెటర్లు అసభ్య ఫొటోలు పంపేవారు: అనయా

image

తనకు కొందరు క్రికెటర్లు న్యూడ్ ఫొటోలు పంపేవారని టీమ్ ఇండియా మాజీ బ్యాటింగ్ కోచ్ కూతురు అనయా తెలిపారు. ఓ సీనియర్ క్రికెటర్ తనతో బెడ్ పంచుకోవాలని ఒత్తిడి చేసేవాడని చెప్పారు. తోటివారితో ఎన్నో అవమానాలకు గురైనట్లు వెల్లడించారు. కాగా బంగర్ కుమారుడు ఆర్యన్ లింగమార్పిడి చేయించుకుని అనయాగా మారారు. అంతకుముందు యశస్వీ జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్‌లతో కలిసి ఆయన క్రికెట్ ఆడారు.

News April 18, 2025

వరంగల్‌: భద్రకాళి చెరువులోని మట్టి కావాలా?

image

వరంగల్ భద్రకాళి చెరువు పూడికతీతలో భాగంగా నల్లమట్టి కావాల్సిన వారు నక్కలగుట్ట ఇరిగేషన్ సర్కిల్-2 కార్యాలయంలో సంప్రదించాలని ఈఈ శంకర్ తెలిపారు. ఒక క్యూబిక్ మీటరు మట్టికి రూ.71.83 డీడీ తీసి కార్యాలయంలో అందజేయాలన్నారు. ఇతర వివరాల కోసం సహాయ కేంద్రం నంబర్ 94406 38401ను సంప్రదించాలన్నారు. నల్లమట్టి పంట పొలాలకు ఎరువులా ఉపయోగపడుతుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

error: Content is protected !!