News March 24, 2025

నాగార్జునసాగర్ నేటి సమాచారం

image

నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమాచారాన్ని అధికారులు సోమవారం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగుల కాగా ప్రస్తుతం 520.60 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 150.3730 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. సాగర్‌కు ఇన్ ఫ్లో 23183 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 14711 క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Similar News

News March 29, 2025

యూట్యూబర్ శంకర్‌పై కేసు నమోదు

image

HYD అంబర్‌పేట పీఎస్‌లో యూట్యూబర్ శంకర్‌‌పై కేసు నమోదైంది. తనపై శంకర్ అత్యాచారం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 69, 79, 352, 351(4) BNS సెక్షన్ల కింద అంబర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని బాధితురాలు ఆరోపించింది. పెళ్లి విషయంలో బలవంతం చేసినందుకు శంకర్ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆ మహిళ తెలిపింది. కాగా, శంకర్‌ది నల్గొండ జిల్లా.

News March 29, 2025

నల్గొండ: ముగ్గురు పిల్లలు మృతి

image

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో <<15910567>>ముగ్గురు పిల్లలు మృతిచెందిన విషయం తెలిసిందే.<<>> RR జిల్లా తలకొండపల్లికి చెందిన చెన్నయ్య 2012లో నల్గొండ జిల్లా మందాపూర్‌ వాసి రజితను పెళ్లి చేసుకున్నాడు. గురువారం రాత్రి ఇంట్లో వారంతా భోజనం చేశారు. అయితే రజిత, పిల్లలు పెరుగు, పప్పుతో తినగా చెన్నయ్య మాత్రం పప్పుతో మాత్రమే తిన్నాడు. శుక్రవారం పొద్దున చూడగా పిల్లలు చనిపోయారు. రజితకు సీరియస్‌గా ఉందని ఆస్పత్రికి తరలించారు.

News March 29, 2025

రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గా వద్ద ఏర్పాట్ల పరిశీలన

image

రంజాన్ పండుగ సందర్భంగా నల్లగొండలోని ఈద్గా వద్ద డీఎస్పీ శివరామిరెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో రంజాన్ పండుగ జరుపుకోవాలని కోరారు. ఈద్గా కమిటీ వైస్ ఛైర్మన్ డాక్టర్ ఎంఏ హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ పరిశుభ్రమైన వాతావరణంలో ఎండ వేడిమి, దృశ్య తాగునీరు, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారుఈ కార్యక్రమంలో సీఐ రాజశేఖర్ రెడ్డి, ఈద్గా సెక్రటరీ ఫుర్ఖాన్ పాల్గొన్నారు.

error: Content is protected !!