News March 28, 2025

నాగోల్: స్కైవాక్ నిర్మాణాలపై సంస్థల ఆసక్తి..!

image

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం కొన్ని సంస్థలు స్థానిక నాగోల్, ఉప్పల్ స్టేడియం, దుర్గం చెరువు, కూకట్పల్లి తదితర మెట్రో స్టేషన్ల నుంచి స్కైవాక్ నిర్మించేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు L&T తెలిపింది. మెట్రో నుంచి స్కై వాక్ నిర్మాణాలకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా సంప్రదింపులు జరుగుతున్నాయి.

Similar News

News April 2, 2025

ఉంగుటూరు: వ్యక్తిపై గొడ్డలితో దాడి

image

ఉంగుటూరు గ్రామానికి చెందిన ఒక వ్యక్తిపై మరో వ్యక్తి గొడ్డలి తో దాడి చేసిన సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. వివాహేతర సంబంధం కారణంగా ఈ హత్యాయత్నం జరిగిందని సమాచారం. నారాయణపురం నుంచి వస్తుండగా జాతీయ రహదారి వద్ద మాటు వేసి గొడ్డలితో తలపై నరికినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వ్యక్తిని మోటార్ సైకిల్‌పై తాడేపల్లిగూడెం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 2, 2025

శ్రీశైల మల్లన్నకు రూ.6.10కోట్ల ఆదాయం

image

AP: శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం 27 రోజులకు గానూ రూ.6.10కోట్లు వచ్చినట్లు దేవాలయ అధికారులు తెలిపారు. దీంతో పాటు 20.1 తులాల బంగారం, 6.2 కిలోల వెండిని భక్తులు సమర్పించినట్లు చెప్పారు. అదే విధంగా 990 యూఎస్ డాలర్లు, ఇతర దేశాల కరెన్సీ కూడా హుండీలో వేసినట్లు పేర్కొన్నారు. ఇటీవల ఉగాది వేడుకల సందర్భంగా శ్రీశైలానికి భక్తులు పోటెత్తిన విషయం తెలిసిందే.

News April 2, 2025

ఉపాధిలో అల్లూరి జిల్లాకు రాష్ట్రంలో మొదటి స్థానం

image

ఉపాధి హామీ పథకంలో అత్యధికంగా 69,062 కుటుంబాలకు 100 రోజుల ఉపాధిని అందించడం ద్వారా అల్లూరి జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానాన్ని సాధించిందని కలెక్టర్ దినేశ్ కుమార్ మంగళవారం తెలిపారు. ఉపాధి హామీ పథకం ప్రగతిలో జిల్లా ముందంజలో ఉందన్నారు. ప్రతి కూలీకి సగటున 74.85 రోజుల పనిని అందించడంతో రాష్ట్రంలో మొదటి స్థానం సాధించిందన్నారు. హార్టికల్చర్ 10,939 ఎకరాలు సాగు చేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు.

error: Content is protected !!