News February 8, 2025

నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి

image

కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్స్ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పమేలా సత్పతికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగులు, పట్టభద్రులు గత బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యానికి మోసపూరిత వాగ్దానాలకు బలయ్యారన్నారు.

Similar News

News December 17, 2025

ఖమ్మం: ముగిసిన మూడో విడత.. 86.65% ఓటింగ్

image

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 86.65 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా వెల్లడించారు. పోలింగ్ ముగియడంతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మరికొద్ది సేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించి ఫలితాలను వెల్లడించనున్నారు.

News December 17, 2025

ఇబ్బందులు సృష్టిస్తే కఠిన చర్యలు: నిర్మల్ ఎస్పీ

image

చివరి దశ పంచాయతీ ఎన్నికల్లో ఐదు మండలాల్లో ఇబ్బందులు కలిగించి ఎన్నికల విధులకు ఆటంకం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జానకి షర్మిల స్పష్టం చేశారు. బుధవారం ముధోల్, బాసర, తానూరు తదితర పోలింగ్ కేంద్రాలకు సందర్శించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ సిబ్బంది, భద్రత సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించారన్నారు.

News December 17, 2025

గొల్లపల్లి : పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా ఎస్పీ

image

గొల్లపల్లి (M) ఇబ్రహీంనగర్, గొల్లపల్లి, పెగడపల్లి (M) బతికపల్లి, నంచర్ల గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను బుధవారం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.