News April 8, 2025

నార్సింగి : భర్తతో గొడవ భార్య ఆత్మహత్య

image

భర్తతో గొడవ పడి భార్య ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నార్సింగి మండలంలోని వల్లూర్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ అహ్మద్ మోహినోద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. వల్లూరుకి చెందిన మౌనిక (30)భర్త సురేష్‌తో గొడవ పడి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. భర్త పనికి వెళ్లి వచ్చేసరికి మౌనిక ఈ దుర్ఘటనకు పాల్పడింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వెల్లడించారు.

Similar News

News April 19, 2025

మందమర్రి: యువకుడి ఇంటిముందు హిజ్రాల ధర్నా

image

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో హిజ్రాలు బైఠాయించి ఆందోళన చేపట్టారు. పట్టణంలోని మొదటి జోన్ కమ్యూనిటీ హాల్ వెనకాల హిజ్రాలను వేధింపులకు గురి చేస్తున్న ఓ యువకుడి ఇంటి ముందు హిజ్రాలు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. తమను యువకుడు అసభ్య పదజాలంతో వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. అతని వలన తీవ్ర ఆందోళనకు గురవుతున్నామన్నారు. వెంటనే అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

News April 19, 2025

బూర్జ : స్విమ్మింగ్‌లో అరుదైన రికార్డు

image

బూర్జ మండలం డొంకలపర్తికి చెందిన గణేశ్ తెలుగు రాష్ట్రాల నుంచి మొదటి పారా స్విమ్మర్‌గా అరుదైన రికార్డు సాధించారు. ఏలూరు క్రీడా ప్రాధికార సంస్థ స్విమ్మింగ్ కోచ్ గణేశ్ శుక్రవారం శ్రీలంకలోని తలైమన్నారు నుంచి భారతదేశంలోని ధనుష్కోటి వరకు పోటీజరిగింది. 28 కిలోమీటర్లను 10:30 గంటల్లో స్విమ్ చేసి రికార్డు నెలకొల్పారని AP పారాస్పోర్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి వి. రామస్వామి తెలిపారు.

News April 19, 2025

HYDలో వ్యభిచార ముఠా గుట్టురట్టు

image

సికింద్రాబాద్ రాంగోపాల్‌పేట్‌ బాపుబాగ్‌లోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కాసమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఇద్దరు యువతులను రక్షించి, ముఠాలోని అవియాజ్, హుస్సేన్‌లను అరెస్ట్ చేశారు. ఉద్యోగాల కోసం HYDకు వచ్చిన అమాయకపు యువతులను స్వప్న అనే మహిళ ఈ కూపంలోకి దించుతోందని గుర్తించారు. ఈ ముఠాలోని లడ్డు, స్వప్న పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

error: Content is protected !!