News February 13, 2025

నిజాంసాగర్: అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

image

ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన నిజాంసాగర్ మండలంలోని చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. బుర్గుల్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో ఎల్లారెడ్డి మండలం వెంకటపురం గ్రామానికి చెందిన తిమ్మయ్య(48) అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతుని కుమారుడు యేసు ప్రభు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

Similar News

News February 13, 2025

రేపు మాలమహానాడు బంద్ లేదు: రాష్ట్ర అధ్యక్షుడు

image

జాతీయ మాలమహానాడు ఆధ్వర్యంలో శుక్రవారం తెలంగాణలో ఎలాంటి బంద్‌కు పిలుపునివ్వలేదని రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ పేర్కొన్నారు. గుర్తు తెలియని వారు సంఘం పేరుతో దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. దీనిని విద్యారంగ సంస్థలు, వ్యాపార వాణిజ్య సంస్థలు గమనించాలని కోరారు. తదుపరి కార్యాచరణను ప్రకటించే వరకు మాల మహానాడు కార్యకర్తలు సహకరించాలని సూచించారు. 

News February 13, 2025

ఎస్పీ కార్యాలయంలో పోలీస్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం

image

మెదక్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో గురువారం జిల్లా పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లో నూతనంగా నియమితులైన పోలీస్ సిబ్బందికి రెండు రోజులపాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ మహేందర్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఈఐఆర్, ఐఆర్ఏడి సైబర్ అవేర్‌నెస్, ఈ ఛానల్ పై వారికి శిక్షణ ఇచ్చారు.

News February 13, 2025

మధురైలో పవన్‌ను కలిసిన OG సినిమాటోగ్రాఫర్

image

తమిళనాడులో పర్యటిస్తున్న Dy.CM పవన్‌ కళ్యాణ్‌ను మధురైలో ‘OG’ సినిమాటోగ్రాఫర్ రవి కె.చంద్రన్ కలిశారు. ఈ సందర్భంగా తన కుమారుడు అకీరా నందన్‌ను పవర్ స్టార్ పరిచయం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి. కాగా OG చిత్రాన్ని డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తిచేసి విడుదల చేయాలని అభిమానులు కోరుతున్నారు.

error: Content is protected !!