News March 15, 2025
నిజాంసాగర్: గ్రామస్థుల సహకారం అవసరం: కలెక్టర్

పాఠశాలల అభివృద్ధిలో గ్రామస్తుల సహకారం ఎంతో అవసరమని KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేర్కొన్నారు. నిజాంసాగర్ మండలం అచ్చంపేట ప్రాథమిక పాఠశాలలో కృత్రిమ మేధ ఆధారిత ఎఫ్ఎల్ఎన్ ల్యాబ్ను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన తల్లిదండ్రులకు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎఫ్ఎల్ఎన్ ల్యాబ్ విద్యార్థులకు సులభంగా మౌలిక భాషా గణిత సామర్ధ్యాలను సాధించడానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
Similar News
News March 16, 2025
సంగారెడ్డి: కమిషనర్లు, మేనేజర్లకు షోకాజ్ నోటీసులు

మున్సిపాలిటీలో ఆస్తి పన్ను వస్తువులు నిర్లక్ష్యం వహించిన అధికారులకు శనివారం కలెక్టర్ వల్లూరు క్రాంతి నోటీసులు జారీ చేశారు. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్లు, మేనేజర్లు ప్రసాద్ చౌహన్, ఉమ, ఉమ మహేశ్వర రావు, సూర్య ప్రకాష్, ఉమర్ సింగ్, ఉమేశ్వర్ లాల్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీరితోపాటు సంగారెడ్డిలో 27, జహీరాబాద్లో 8, సదాశివపేటలో 14 మంది బిల్ కలెక్టర్లకు కూడా నోటీసులు ఇచ్చారు.
News March 16, 2025
పెండింగ్ కేసుల చేధనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్: ఎస్పీ

పెండింగ్ కేసుల చేధనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాన్ని శనివారం సాయంత్రం ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులను పరిశీలించారు. మాదక ద్రవ్యాల నిర్మూలన, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
News March 16, 2025
ఈనెల 26న వికారాబాద్లో వాహనాల వేలం: ఎస్పీ

జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో వదిలేసిన, గుర్తుతెలియని 148 వాహనాలకు ఈనెల 26న వేలం వేయనున్నట్లు ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు. జిల్లాలో దొరికిన వాహనాలను వికారాబాద్లో భద్రపరిచామని, పోలీస్ చట్టం 1861లోని సెక్షన్ 26 ప్రకారం ఈ వాహనాలను బహిరంగ వేలం నిర్వహిస్తునట్లు చెప్పారు. మరిన్ని వివరాలకు ఎస్పీ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.