News June 1, 2024
నిజామాబాద్: ముగిసిన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం ఇంటర్మీడియట్ కామర్స్, కెమిస్ట్రీలతో సప్లిమెంటరీ పరీక్షలు ముగిసాయి. శుక్రవారం ఉదయం మొదటి సంవత్సరం పరీక్షలు జరగగా మధ్యాహ్నం రెండవ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలియజేశారు. మొదటి సంవత్సరం పరీక్షలకు 6164 మంది విద్యార్థులు హాజరయ్యారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 2999 మంది విద్యార్థులు హాజరయ్యారు.
Similar News
News February 12, 2025
NZB: తాళం వేసిన ఇంట్లో చోరీ
ఇంటికి తాళం వేసి కుటుంబం కుంభమేళాకు వెళ్లగా గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన నిజామాబాద్లో జరిగింది. కంఠేశ్వర్ బైపాస్ రోడ్లో నివాసం ఉండే శేఖర్ కుటుంబంతో కలిసి సోమవారం కుంభమేళాకు వెళ్లారు. కాగా అదే రాత్రి దొంగలు తాళం పగలగొట్టి ఇంట్లోని 2 తులాల బంగారం, 40 వేల నగదు అపహరించినట్లు బాధితుడు తెలిపారు.
News February 12, 2025
నిజామాబాద్లో ఫొటో జర్నలిస్టు మృతి
నిజామాబాద్లో అనారోగ్యంతో సీనియర్ ఫొటో జర్నలిస్టు రమణ మృతి చెందాడు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆయన పలు వార్త పత్రికల్లో ఫొటోగ్రాఫర్గా పనిచేశారు. కాగా ఆయన మృతి పట్ల జర్నలిస్టు సంఘాల నాయకులు, ప్రెస్ క్లబ్ సభ్యులు నివాళులర్పించారు.
News February 12, 2025
NZB: బావిలో పడి బాలుడి మృతి
నిజామాబాద్ జిల్లాలో ఓ బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన ఘటన మంగళవారం ఇందల్వాయి మండలం డొంకల్ తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన లక్ష్మణ్(13) మరో ఇద్దరితో కలిసి మేకలు కాయడానికి గ్రామ శివారులోకి వెళ్లారు. బావిలో నీటిని తాగడానికి వెళ్లి ప్రమాదవశాత్తు అందులో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కుటుంబీకులు వెళ్లి చూసేసరికి లక్ష్మణ్ మృతి చెందినట్లు వెల్లడించారు.