News March 28, 2024
నిడమర్రు: వాహన తనిఖీల్లో రూ.3.5 లక్షల నగదు సీజ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1711569925969-normal-WIFI.webp)
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జిల్లాలో బుధవారం పలు చోట్ల నిర్వహించిన వాహనాల తనిఖీల్లో రూ.3.5 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఉంగుటూరు మండలం బువ్వనపల్లి చెక్పోస్టు వద్ద నిర్వహించిన తనిఖీల్లో రూ1.75 లక్షలు నగదు సీజ్ చేసినట్లు నిడమర్రు ఎస్సై ఆర్.శ్రీను చెప్పారు. బువ్వనపల్లి సత్యనారాయణపురంలో ఎటువంటి పత్రాలు లేకుండా కారులో రూ.1.75 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News February 8, 2025
ఢిల్లీ ఫలితాలపై ప.గో. జిల్లాలో టెన్షన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738990968877_51228803-normal-WIFI.webp)
ఢిల్లీలో ఎన్నికల ఫలితాలపై సర్వత్ర ఉత్కంఠ రేగుతోంది. అయితే ఢిల్లీ ఎన్నికల సెగ జిల్లాను సైతం సాగుతోంది. ఢిల్లీలో నేడు వెల్లడి కానున్న ఎన్నికల ఫలితాలపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జోరుగా పందేలు సాగుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ, ఆప్ మధ్య పోరు జరుగుతుండగా ఇక్కడి పందెం రాయుళ్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తుది ఫలితాలు పూర్తిస్థాయిలో వెల్లడయ్యేసరికి పెద్ద ఎత్తున నగదు చేతులు మారనుంది.
News February 8, 2025
JRG: 8వ తరగతి బాలికపై అత్యాచారం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738989323818_1221-normal-WIFI.webp)
జంగారెడ్డిగూడెం(M) ఓ గ్రామానికి చెందిన వ్యక్తి అత్యాచారం చేసిన ఘటనలో బాలిక అమ్మమ్మ ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు SI జబీర్ తెలిపారు. SI వివరాల ప్రకారం.. 8వ తరగతి చదువుతున్న బాలికపై ఈ నెల 5న ఇంటికి వెళ్తుండగా శ్యామ్ అనే వ్యక్తి మాయ మాటలు చెప్పి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారన్నారు. బాలిక కుటుంబీకులకు విషయం చెప్పడంతో వారు నిన్న ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామన్నారు.
News February 8, 2025
నరసాపురం: ఉత్సవ ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738943699241_50090654-normal-WIFI.webp)
నరసాపురంలోని మాధవాయిపాలెం – సఖినేటిపల్లి రేవును శుక్రవారం ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. బందోబస్తు విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవాలు పూర్తయ్యేంతవరకు ప్రణాళికా బద్ధంగా పనిచేస్తూ, కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. భక్తులు పోలీస్ వారి సూచనలను పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఎస్పీ తెలిపారు.