News February 17, 2025
నిపుణులతో విద్యార్థులకు కంటి పరీక్షలు: DMHO

నిపుణులతో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డా.మధుసూదన్ తెలిపారు. BHPL జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఫిబ్రవరి 17 నుంచి 25 వరకు 8 రోజులపాటు కొనసాగనున్నట్లు తెలిపారు. ఆర్.బి.ఎస్.కె, టీం ద్వారా ఫేస్ 1, ఫేస్ 2లో 5 నుంచి 10 తరగతి చదువుతున్న విద్యార్థులకు కళ్లు స్క్రీనింగ్ చేసి కంటి సమస్యలు గుర్తించనున్నట్లు తెలిపారు.
Similar News
News December 18, 2025
శనగ పంటలో జింకు లోపం నివారణ

ఉదజని సూచిక ఎక్కువగా ఉన్న నేలలు, వరి తర్వాత శనగ సాగు చేసే నేలల్లో జింకు లోపం కనిపిస్తుంది. మొక్క వేరు వ్యవస్థ దృఢంగా ఉండేందుకు, బొడిపెలు బాగా కట్టేందుకు, బొడిపెలలో నత్రజని ఎక్కువగా ఉండేందుకు జింకు అవసరం. జింకు లోపం వల్ల మొక్క మధ్య, దిగువ భాగంలో ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోతాయి. ఈ లక్షణాలు కనిపిస్తే లీటరు నీటికి జింక్ సల్ఫేట్ 2 గ్రాములను కలిపి పిచికారీ చేస్తే మొక్కలు తొందరగా కోలుకుంటాయి.
News December 18, 2025
మీ ఊరిలో ఎవరు గెలిచారు?.. ఎక్కడ చూసినా ఇదే చర్చ!

TG: పంచాయతీ ఎన్నికల తుది పోలింగ్ ముగియడంతో ఎక్కడ చూసినా కొత్త సర్పంచ్ల గురించే చర్చ. ప్రలోభాలను చూసి ఓటేశారా? అభివృద్ధి చేస్తారని నమ్మారా? అని ఒకరిని ఒకరు ఆరా తీస్తున్నారు. భారీగా డబ్బు పంచి గెలిచారని చాలచోట్ల జనం మాట్లాడుకుంటున్నారు. కుల సమీకరణాలు, నోట్ల కట్టల ప్రభావం గెలుపోటములను శాసించాయనే ఆరోపణలు వస్తున్నాయి. మీ ఊరి కొత్త సర్పంచ్ ఎవరు? ఏ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలిచారో కామెంట్ చేయండి.
News December 18, 2025
కాకినాడ జిల్లా ప్రత్యేక అధికారిగా ప్రసన్న వెంకటేశ్

కలెక్టర్ల రెండో రోజు సమావేశం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా.. కాకినాడ జిల్లా బాధ్యతలను సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రసన్న వెంకటేశ్కు అప్పగించింది. జిల్లాలోని అన్ని శాఖలను సమన్వయం చేస్తూ, అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో మరింత మెరుగ్గా అమలు చేయడం లక్ష్యంగా ఆయన విధులు నిర్వహించనున్నారు.


