News April 25, 2025
నియమ నిబంధనలు పాటించని ఆ ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు: డీఎంహెచ్వో

ములుగు జిల్లాలో ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్వో గోపాలరావు అన్నారు. గురువారం జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రిలో యాజమాన్యాలతో డీఎంహెచ్వో సమావేశం నిర్వహించారు. ప్రైవేటు ఆసుపత్రులు తాము అందించే సేవలు,తీసుకునే ఫీజుల వివరాల తో కూడిన ధరల పట్టికను ఆస్పత్రులలో ఏర్పాటు చేయాలని అన్నారు. నిబంధనలు పాటించని ఆస్పత్రులపై కేసులు పెడతామన్నారు.
Similar News
News April 25, 2025
పాక్ అథ్లెట్కి ఆహ్వానం.. స్పందించిన నీరజ్ చోప్రా

పాక్ ఆటగాడు అర్షద్ను NC క్లాసిక్ ఈవెంట్కు ఆహ్వానించడంపై భారత జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా ఓ ప్రకటనలో వివరణ ఇచ్చారు. ‘అర్షద్కు ఆ ఆహ్వానం ఉగ్రదాడులకు ముందు పంపించా. ఆ ఘటన తర్వాత అతడిని పిలిచే ప్రసక్తే లేదు. నాకు నా దేశమే ముఖ్యం. నన్ను, నా కుటుంబాన్ని అకారణంగా లక్ష్యంగా చేసుకున్నారు. ఏడాది క్రితం నా తల్లిని కొనియాడిన అదే నోళ్లు నేడు ఆమెను దారుణంగా తిడుతున్నాయి’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
News April 25, 2025
HYD: 15 రోజుల్లో 1,275 మంది మైనర్లపై కేసులు

నగర వ్యాప్తంగా మైనర్ల డ్రైవింగ్పై సిటీ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. 15 రోజులుగా వివిధ ప్రాంతాల్లో వాహనాలు నడుపుతున్న 1,275 మంది మైనర్లను గుర్తించి వారిపై కేసులు నమోదు చేశామని సిటీ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. వీరిపై ఛార్జిషీట్ దాఖలు చేసి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని మరోసారి హెచ్చరిస్తున్నారు.
News April 25, 2025
శిథిలావస్థలో హైదరాబాద్ చారిత్రక సంపద

పాతబస్తీలోని పురాతన భవనం పత్తర్గట్టి భవనం శిథిలావస్థకు చేరుకుంది. గత నెలలో పెచ్చులూడి పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. 1911లో నిర్మించిన ఈ హెరిటేజ్ భవన సంరక్షణను ప్రభుత్వం పూర్తిగా వదిలేసిందని స్థానికులు చెబుతున్నారు. చార్కమాన్ల ఆధునీకరణలో భాగంగా 2009లో కేవలం రెండింటికి మాత్రమే మరమ్మతులు చేశారని తెలిపారు. HYD చారిత్రక సంపదను సంరక్షించాలని పలువురు కోరుతున్నారు.