News February 27, 2025
నిర్మల్: 109 మంది ఓటేశారు..!

నిర్మల్ జిల్లా పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో గత మూడు రోజుల నుంచి జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ బుధవారం ముగిసింది. ఎన్నికల విధుల్లోని ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం జిల్లాలో మొత్తం 149 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 109 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని పోలింగ్ అధికారులు తెలిపారు.
Similar News
News February 27, 2025
HYD: అయ్యో ఎంత పనిచేశారు సారూ..!

పండగపూట లంగర్హౌస్ చెరువులో <<15590306>>తండ్రీ కొడుకులు<<>> మృతిచెందిన విషయం తెలిసిందే. వారు చనిపోవడానికి ముందు జరిగిన పరిణామాలు స్థానికులు చెబుతుంటే కలవరపెడుతున్నాయి. కొడుకును భుజాన ఎత్తుకుని మునిగిపోతూ అధికారులు, సిబ్బందిని రక్షించమని వేడుకున్నా.. వారు స్పందించకుండా సాయం కావాలని స్థానిక నాయకులకు ఫోన్ చేసి అడిగారని ప్రత్యక్షసాక్షులు వాపోయారు. వారు సాయం అందించుంటే ఇద్దరూ బతికుండేవారని బాధిత కుటుంబం రోదించింది.
News February 27, 2025
గుంటూరులో యాక్సిడెంట్ ఇద్దరు దుర్మరణం.!

కాకానిరోడ్డులోని వాసవీ మార్కెట్ వద్ద మూడు ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎన్టీఆర్ నగర్ ప్రాంతానికి చెందిన సి.హెచ్ వెంకటేశ్ (15), లాలాపేట ప్రాంతానికి చెందిన అలీ (28) ఈ ప్రమాదంలో మరణించారు. మరో యువకుడు గాయపడినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈస్ట్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 27, 2025
భోగాపురంలో చీటీల పేరుతో మోసం.. భార్యాభర్తల అరెస్ట్

భోగాపురంలో చీటీల పేరుతో మోసం చేసిన కేసులో భార్యాభర్తలను అరెస్ట్ చేశారు. భోగాపురంలో ఉంటున్న భార్యాభర్తలు తులసీ, మురళీ చీటీలు నిర్వహించేవారు. చీటీ పూర్తయిన వారికి డబ్బులు చెల్లించకుండా పరారీలో ఉన్నారు. దీంతో రూ.30 కోట్ల వరకు నష్టపోయామంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా దార్యాప్తు చేపట్టారు. పోలీసులు ఈనెల 25న రాజమహేంద్రవరంలో వీరిని అదుపులోకి తీసుకొని బుధవారం విజయనగరం కోర్టులో హాజరుపరిచారు.