News March 20, 2025

నిర్మల్: ఆ గురువులే కీచకులు

image

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన కొందరు ఉపాధ్యాయులే విద్యార్థుల పట్ల కీచకంగా మారుతున్నారు. నిర్మల్(D) నర్సాపూర్ (జి)లో గణిత ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించి అరెస్టు అయ్యాడు. విద్యార్థినుల తల్లిదండ్రులు వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల జడ్పీ స్కూల్, సాయికుంట ఆశ్రమ పాఠశాల, భీమిని పాఠశాలలో కూడా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

Similar News

News December 15, 2025

MBNR: PHASE-3 ఎన్నికలకు భారీ బందోబస్తు: ఎస్పీ

image

మహబూబ్‌నగర్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు అడ్డాకుల, బాలానగర్, జడ్చర్ల, మూసాపేట, భూత్పూర్ మండలాల్లో ఈనెల 17న ఉదయం 7:00 గంటల నుంచి మధ్యాహ్నం 01:00 గంటల వరకు జరగనున్న నేపథ్యంలో ఎన్నికలు శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ డి. జానకి తెలిపారు.

News December 15, 2025

T20 సిరీస్‌ నుంచి అక్షర్ పటేల్ ఔట్

image

సౌతాఫ్రికాతో జరుగుతోన్న టీ20 సిరీస్‌లో మిగిలిన మ్యాచులకు టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ దూరమైనట్లు BCCI ప్రకటించింది. అనారోగ్యం కారణంగా మిగిలిన రెండు మ్యాచులకు ఆయన అందుబాటులో ఉండరని తెలిపింది. అక్షర్ స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్‌ను జట్టులోకి తీసుకుంది. 5 మ్యాచుల T20 సిరీస్‌లో ఇప్పటివరకు 3 మ్యాచులు జరగగా IND 2, SA 1 గెలిచాయి. ఈ నెల 17న 4th, 19న 5th టీ20 జరగనుంది.

News December 15, 2025

‘తీరప్రాంత రైతులకు వరం.. సముద్రపు పాచి సాగు’

image

సముద్ర తీర ప్రాంతాల పర్యావరణ పరిరక్షణతో పాటు మత్స్యకారులు, రైతుల జీవనోపాధికి సముద్రపు పాచి, ఆస్పరాగస్‌ సాగు ఎంతో కీలకమని కలెక్టర్‌ మహేశ్ కుమార్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో వీటి సాగుపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సమీక్షించారు. లవణ భరిత నేలల్లో పెరిగే హలో ఫైటు రకానికి చెందిన సముద్ర ఆస్పరాగస్‌ ఉప్పునీటి నేలల్లో సులభంగా పెరుగుతుందన్నారు. దీంతో తీరప్రాంత ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు.