News April 16, 2025

నిర్మల్: ఈ వాహనమే ప్రాణం తీసింది

image

దిలావర్పూర్ మండల సిర్గాపూర్ సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. ఇందులో మహారాష్ట్రకు చెందిన రాజు (45)అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన కొడుకు కేదారనాథ్ అస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. మొదట్లో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టినట్లు కేసు నమోదుచేసిన పోలీసులు తర్వాత సీసీపుటేజీలను పరిశీలించి వాహనాన్ని గుర్తించారు.

Similar News

News April 16, 2025

భద్రాద్రి: ‘సన్నబియ్యం పంపిణీపై ఫేక్ న్యూస్ నమ్మొద్దు’

image

తప్పుడు ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి జిల్లా పౌరసరఫరాల శాఖ అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ తెలిపారు. చౌక దుకాణాల ద్వారా ప్లాస్టిక్ బియ్యం సరఫరా చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఫేక్ న్యూస్ పోస్ట్ చేసిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదయిందని చెప్పారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న బియ్యం బాగున్నాయని, అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News April 16, 2025

స్టాక్ పాయింట్ల వద్ద ఇసుక ఉంచాలి: ఇన్‌ఛార్జి కలెక్టర్ 

image

జిల్లా అవసరాలకు అనుగుణంగా ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద ఇసుక లభ్యత ఉండేలా పటిష్టమైన ప్రణాళికను రూపొందించాలని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి గనుల శాఖ అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్‌ గౌతమీ సమావేశపు హాల్‌లో బుధవారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం ఇన్‌ఛార్జి కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా ధాత్రిరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో ఉచిత ఇసుక విధానం ద్వారా ప్రజలకు అందించాలన్నారు.

News April 16, 2025

ADB: విద్యార్థులపై విష ప్రయోగం.. ఒకరి అరెస్టు: SP

image

ఇచ్చోడ మండలం ధర్మపురి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులపై <<16115277>>విషప్రయోగం<<>> చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. SP అఖిల్ మహాజన్ కథనం ప్రకారం.. గోండుగూడకు చెందిన సోయం కిష్టు నిర్మల్ సోదరుడి ఇంటి నుంచి పురుగుమందు తీసుకొచ్చి పాఠశాల వంటగది తాళాన్ని పగలగొట్టి చల్లాడని అంగీకరించాడన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశామన్నారు. నిందితుడు కుటుంబ కలహాల కారణంగా మానసిక ఆందోళనతో ఈ చర్యకు పాల్పడినట్లు చెప్పారు.

error: Content is protected !!