News April 9, 2025
నిర్మల్: ఘోరం.. 1000 మందిని ఉరితీశారు.!

నిర్మల్ పట్టణ ప్రాంతంలో ప్రపంచంలో ఎక్కడా కనీవినీ ఎరగని రీతిలో ఘోరం జరిగింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన రాంజీ గోండు అతని 1000 మంది అనుచరులను బంధించారు. 1860 ఏప్రిల్ 9న పట్టణంలోని ప్రస్తుతం కురన్నపేట్ దగ్గరున్న ఖజానా చెరువు వద్దనున్న ఊడలమర్రి చెట్టుకు ఒకేసారి ఉరితీసి చంపేశారు. ఇది జలియన్ వాలాబాగ్ కంటే అత్యంత భయంకరమని చరిత్రకారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ చెట్టు వర్షాలకు కూలిపోయింది.
Similar News
News April 19, 2025
విచారణకు హాజరైన మిథున్ రెడ్డి

AP: మద్యం కేసులో విచారణకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. విజయవాడలోని సిట్ కార్యాలయంలో అధికారులు ఆయనను విచారిస్తున్నారు. నిన్న విజయసాయి రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మేరకు మిథున్ రెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉంది.
News April 19, 2025
జనగామ జిల్లా చరిత్ర, ప్రత్యేకతలు ఇవే!

జనగామ జిల్లాకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది 11వ శతాబ్దంలో కల్యాణి చాళుక్యుల 2వ రాజధానిగా నిలిచింది. 1195-1323 వరకు కాకతీయుల పాలనలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. జనగామలో జైన తీర్థంకరుల శిల్పాలు కనుగొనబడ్డాయి. ఇది మేఘాలిథిక్ యుగంలో జైనిజం ప్రాచుర్యాన్ని సూచిస్తుంది. కాగా, జిల్లాలో జీడికల్ రామచంద్ర స్వామి, పాలకుర్తి సోమేశ్వరాలయాలు ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి. మీది ఏమండలం? మీ గ్రామ ప్రత్యేకత కామెంట్ చేయండి.
News April 19, 2025
పెద్దపల్లిలో అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్

పెద్దపల్లి జిల్లాలో అంతర్రాష్ట్ర ATM దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు డీసీపీ కరుణాకర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. దొంగలు రాజస్థాన్కు చెందిన ఇద్దరు సొంత అన్నదమ్ములుగా గుర్తించారు. గత కొద్దిరోజులుగా వస్తున్న ఫిర్యాదులపై పోలీసులు నిఘా పెంచి గాలించారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.