News April 28, 2024
నిర్మల్ జిల్లాకు రాహుల్ గాంధీ..!

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన పార్టీల నాయకులు విస్తృత ప్రచారం చేపట్టారు. ఈ ప్రచారాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లేందుకు అగ్ర నేతలతో బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రానికి మే 5న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సైతం రానున్నట్లు సమాచారం.
Similar News
News April 24, 2025
అదిలాబాద్ నుంచి సికింద్రాబాద్కు గంజాయి రవాణా

నిర్మల్ ప్రాంతానికి చెందిన ఇద్దరు గంజాయి అమ్ముతూ పట్టుబడ్డారు. పోలీసుల వివరాలిలా.. మలావత్ రాజేందర్, ఇండాల్ రాథోడ్ ఆదిలాబాద్ నుంచి గంజాయి కొనుగోలు చేసి నగరంలో విక్రయిస్తున్నారు. బుధవారం వారిద్దరు కారులో గంజాయి ప్యాకెట్లు తీసుకుని నగరానికి వస్తుండగా బోయిన్పల్లి వద్ద ఎక్సైజ్ SI శివకృష్ణ వీరిని అదుపులోకి తీసుకున్నారు.
News April 24, 2025
ADB: మూడు రోజుల పాటు RED ALERT

ఉమ్మడి ADB జిల్లాలో ఏప్రిల్ చివరి వారంలోనే సుమారు 40 నుంచి 44 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే 3 రోజులపాటు తీవ్ర వడగాలులతో పాటు ఉక్కపోత ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ADB, NRML, MNCL, ASF జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు చేసుకోవాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. మేలో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో జాగ్రత్తగా ఉండండి.
News April 24, 2025
ADB: వడ్డీ వ్యాపారులపై కొరడా జులిపిస్తున్న ఎస్పీ

జనాల రక్తాన్ని పిండి పీడిస్తున్న వడ్డీ వ్యాపారులపై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన కొరడా జలపిస్తున్నారు. ఆదిలాబాద్ వన్ టౌన్, టూ టౌన్, మావల, ఇచ్చోడ, బోథ్, ఉట్నూర్ ప్రాంతాలలో ఏకకాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 6 మండలాలలో 30 బృందాలతో ఆకస్మిక దాడులు చేశారు. అధిక వడ్డీ వసూలు చేసే వడ్డీ వ్యాపారులపై జిల్లా వ్యాప్తంగా దాదాపు 20 కేసుల నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.