News April 4, 2025

నిర్మల్: ‘తెలుగు స్క్రైబ్‌ రిపోర్టర్‌పై పోలీసులకు ఫిర్యాదు’

image

తప్పుడు వార్త కథనం ప్రచురించిన వ్యక్తిపై, ఆ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్మల్ మాజీ మున్సిపల్ ఛైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి గురువారం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తెలుగు స్క్రైబ్ అనే పేరుతో ‘చెరువులను కబ్జా పెడుతున్న ముఖ్యమంత్రి అనుచరుడు’ అని తన పరువుకు భంగం కలిగించే కథనాన్ని ప్రచురించాడని పేర్కొన్నారు. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Similar News

News April 11, 2025

2036లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు ప్రయత్నిస్తాం: మోదీ

image

2036 ఒలింపిక్స్‌ భారత్‌లో జరిగేలా ప్రయత్నం చేస్తామని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో విశ్వక్రీడలు నిర్వహిస్తే భారత్‌ ఖ్యాతి పెరుగుతుందని ఆకాంక్షించారు. ఒలింపిక్స్‌లో పాల్గొనేలా వారణాసి యువత నేటి నుంచే శిక్షణ ప్రారంభించాలని కోరారు. గతంతో పోల్చితే కాశీ చాలా అభివృద్ధి చెందిందని, హెల్త్ క్యాపిటల్‌గా మారిందన్నారు. వారణాసిలో పలు అభివృద్ధి పనులకు నేడు మోదీ శంకుస్థాపన చేశారు.

News April 11, 2025

పోలీసుల సమస్యలు తెలుసుకున్న ఎస్పీ

image

విజయనగరం జిల్లా పోలీసుశాఖలో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ‘పోలీసు వెల్ఫేర్ డే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందిని తన ఛాంబర్‌లోకి పిలిచి, వారి వ్యక్తిగత, వృత్తిపరమైన, శాఖాపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు.

News April 11, 2025

కోనో కార్పస్ చెట్ల నరికివేత షురూ

image

TG: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కోనో కార్పస్ చెట్ల నరికివేత ప్రక్రియను GHMC అధికారులు ప్రారంభించారు. ఈ చెట్ల పుప్పొడి రేణువులతో ప్రమాదం ఉంటుందని, ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు చెప్పడంతో వాటిని తొలగిస్తున్నారు. కోనో కార్పస్ చెట్లను నరికేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వానికి సూచించారు. అలాగే జిల్లాల్లో ఉన్న ఈ చెట్లనూ తొలగించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

error: Content is protected !!