News March 12, 2025
నిర్మల్: ‘దివ్యాంగుల జీవితాలను మెరుగుపరిచేందుకు కృషి’

ప్రభుత్వం నూతన పథకాలను ప్రవేశపెట్టి దివ్యాంగుల జీవితాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో సమగ్ర శిక్ష, విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ చేశామన్నారు.
Similar News
News March 13, 2025
SRD: బ్యాంకింగ్లో ఉచిత శిక్షణ

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నెలరోజుల పాటు బ్యాంకింగ్ కోసం ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ టి.ప్రవీణ్ తెలిపారు. డిగ్రీ అర్హత కలిగి 26 ఏళ్ల లోపు గల బీసీ అభ్యర్థులు అర్హులన్నారు. ఈనెల 15 నుంచి ఏప్రిల్ 8 వరకు www.tgbcstudycircle.cgg.gov.inలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 12న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామన్నారు.
News March 13, 2025
మల్దకల్: పట్టు వదలని విక్రమార్కుడు 4 ఉద్యోగాలు సాధించాడు

మల్దకల్ మం. ఎల్కూరుకి చెందిన నిరుపేద రైతు కూలి బిడ్డ మహమ్మద్ సుభాన్ 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. ధరూర్ మం.లో 2014లో పంచాయతీ కార్యదర్శిగా పనిచేశాడు. 2024లో ప్రభుత్వ గురుకుల పాఠశాల టీచర్, జూనియర్ లెక్చరర్గా ఉద్యోగాలు సాధించాడు. 2023లో టీజీపీఎస్సీ నిర్వహించిన జూనియర్ లెక్చరర్ల రాతపరీక్షలో ప్రతిభ చాటి ఫిజిక్స్ లెక్చరర్గా ఉద్యోగం సంపాదించాడు. ఈ మేరకు నియామకపత్రాన్ని సీఎం చేతుల మీదుగా అందుకున్నారు.
News March 13, 2025
మెదక్: బెస్ట్ ఉమన్ ఎంప్లాయ్ అవార్డు అందుకున్న DRO

మెదక్ జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అదే విధంగా వివిధ శాఖలకు చెందిన మహిళా అధికారులను, ఉత్తమ మహిళా ఉద్యోగులను ప్రశంసా పత్రాలతో పాటు బహుమతులను ప్రదానం చేశారు. అందులో భాగంగా ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గీత అగర్వాల్కు కలెక్టర్ రాహుల్ రాజ్ చేతుల మీదుగా బెస్ట్ ఉమెన్ ఎంప్లాయ్ అవార్డు అందజేశారు.