News March 20, 2025

నిర్మల్‌: పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు

image

నిర్మల్ జిల్లాలో ఈనెల 21వ తేదీ నుంచి జరగనున్న పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల బుధవారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 47 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సెంటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు 163 బీఎన్ఎస్ సెక్షన్‌ను అమలు చేస్తున్నామన్నారు.

Similar News

News March 28, 2025

NLG: మధ్యాహ్నం వేళ.. రోడ్లన్నీ ఖాళీ..!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండలు ముదురుతున్నాయి. మునుపెన్నడూ లేనంతగా భానుడు భగ్గుమంటున్నాడు. వారం రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు జనం బెంబేలెత్తుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నం వేళలో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఉపాధి కూలీలు, కార్మికులు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

News March 28, 2025

NLG: జీపీఓ పోస్టుల భర్తీకి కసరత్తు

image

గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ పటిష్ఠానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామీణ ప్రజలకు రెవెన్యూ సేవలు అందించేలా గ్రామ పాలనాధికారి పేరుతో ఉద్యోగులను నియమించేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మంది 370 మంది జీపీఓ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే జిల్లాలో ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయో.. ఎంత మందిని నియమిస్తారనేది ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు.

News March 28, 2025

సల్మాన్ ఖాన్‌పై సౌత్ ఆడియన్స్ విమర్శలు

image

సల్మాన్ ఖాన్ సౌత్ ఆడియన్స్‌పై తాజాగా చేసిన వ్యాఖ్యల పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమ సినిమాల్ని <<15910211>>దక్షిణ రాష్ట్రాల వాళ్లు చూడట్లేదని<<>> సల్మాన్ వాపోయిన సంగతి తెలిసిందే. మేం చూడకుండానే ప్రేమపావురాలు, ప్రేమాలయం, క్రిష్, 3 ఇడియట్స్, ధూమ్, ధూమ్ 2, బజరంగీ భాయ్‌జాన్ వంటి అనేక సినిమాలు హిట్ అయ్యాయా అంటూ పలువురు సినీ ప్రేమికులు నెట్టింట సల్మాన్‌ను ప్రశ్నిస్తున్నారు.

error: Content is protected !!