News March 20, 2025
నూజివీడు: గేట్ 2025లో త్రిబుల్ ఐటీ విద్యార్థుల ప్రతిభ

రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలో ఉన్న నాలుగు త్రిబుల్ ఐటీలకు చెందిన విద్యార్థులు గేట్ 2025 ఫలితాల్లో ప్రతిభ కనబరిచినట్లు ఆర్జీయూకేటీ ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్ తెలిపారు. గేట్లో వెయ్యిలోపు ర్యాంకులను 30 మంది విద్యార్థులు సాధించినట్లు పేర్కొన్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీకి చెందిన అమిరెడ్డి అశోక్ జాతీయస్థాయిలో 12వ ర్యాంకు సాధించాడని వివరించారు.
Similar News
News March 28, 2025
అనకాపల్లి జిల్లాలో పదో తరగతి పరీక్షకు 222 మంది గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో శుక్రవారం జరిగిన పదో తరగతి బీఎస్ పరీక్షకు 222 విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు 20,774 మంది హాజరు కావాల్సి ఉండగా 20,669 మంది హాజరైనట్లు తెలిపారు. ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు 766 మంది హాజరు కావాల్సి ఉండగా 649 మంది హాజరైనట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు.
News March 28, 2025
IPLలో సరికొత్త చరిత్ర.. రికార్డులు బద్దలు

IPL-2025లో రికార్డులు బద్దలవుతూనే ఉన్నాయి. ఇందుకు గ్రౌండులో ఆటగాళ్లు, టీవీలు, ఫోన్ల ముందు ప్రేక్షకులు పోటీ పడుతున్నారు. ఓపెనింగ్ వీకెండ్లో 137Cr డిజిటల్ వ్యూస్(35% వార్షిక గ్రోత్), 25.3Cr TV వ్యూస్(14% అప్), మొత్తంగా(TV&డిజిటల్) 4,956Cr మినట్స్ వాచ్ టైమ్(33% గ్రోత్) నమోదైనట్లు జియో హాట్స్టార్, స్టార్స్పోర్ట్స్ వెల్లడించాయి. IPLలో ఇదొక సరికొత్త చరిత్ర అని నిపుణులు పేర్కొంటున్నారు.
News March 28, 2025
వరంగల్: జిల్లా వ్యాప్తంగా మొరాయిస్తున్న మీసేవ కేంద్రాలు!

జిల్లా వ్యాప్తంగా మీసేవ కేంద్రాలు, ఇంటర్నెట్ కేంద్రాలు మొరాయిస్తున్నాయని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లోన్ దరఖాస్తు కోసం, స్కాలర్షిప్ అప్లికేషన్ కోసం మీసేవ కేంద్రాల వద్దకు వెళ్లగా ఉదయం నుంచి మీ సేవ కేంద్రాల సర్వీసుకు అంతరాయం ఏర్పడిందన్నారు. అధికారులు స్పందించి సాంకేతిక లోపాన్ని సరి చేసి సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు.