News April 25, 2024

నెల్లూరు నగరంలో యువకుడి దారుణహత్య 

image

నెల్లూరు భక్తవత్సలనగర్‌కు చెందిన రామయ్య కుమారుడు దశరథ తాతతో కలిసి పుచ్చకాయల వ్యాపారం చేస్తున్నాడు. సోమవారం సాయంత్రం పని ఉందని ఇంట్లో నుంచి వెళ్లిన దశరథ తిరిగి రాలేదు. మంగళవారం ఆటోనగర్‌లో దశరథ మృతదేహం వెలుగుజూసింది. కత్తులతో తీవ్రంగా దాడిచేయడంతో దశరథ ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించి మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించి పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

Similar News

News April 22, 2025

త్వరలో అంగన్వాడి పోస్టుల భర్తీకి చర్యలు: కలెక్టర్

image

జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లో నిర్వహించిన ICDS అధికారుల సమావేశంలో మాట్లాడుతూ.. అంగన్వాడీలకు వచ్చే పిల్లలకు ప్రభుత్వం అందించే పౌష్టికాహారం సక్రమంగా అందించి పిల్లల ఎత్తు, బరువు పెరిగే విధంగా పని చేయాలని సూచించారు. బలహీనంగా ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

News April 22, 2025

మే 8 నుంచి పెంచలకోన బ్రహ్మోత్సవాలు 

image

రాపూరు మండలంలోని పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలపై మంగళవారం అధికారులు సమీక్ష నిర్వహించారు. పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మే నెల 8 నుంచి 14 వరకు జరుగుతాయన్నారు. బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు నెల్లూరు ఆర్డీఓ నాగ సంతోషిణి అనూష అన్నారు.

News April 22, 2025

కొడవలూరు రైలు కింద పడిన గుర్తుతెలియని వ్యక్తి

image

తలమంచి – కొడవలూరు రైల్వే స్టేషన్ మూడవ లైన్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు. మృతుని వయసు సుమారు 42-45 ఉంటుందని, పింక్ పసుపు రంగు చొక్కా, సిమెంట్ రంగు లుంగీ ధరించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. జీఆర్పీ ఎస్ఐ రమాదేవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసినవారు కావలి జీఆర్పీ పోలీసులను సంప్రదించాలని సూచించారు. 

error: Content is protected !!