News March 11, 2025

నెల్లూరు: నీటిపారుదల పైపుల ఏర్పాటుకు రూ.35 లక్షలు మంజూరు

image

జాతీయ పోషకాహార భద్రత పథకంలో భాగంగా చిరుధాన్యాలు, నీటిపారుదల కొరకు పైపుల ఏర్పాటుకు రూ.35 లక్షల నిధులు మంజూరైనట్లు నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ సత్యవాణి ఓ ప్రకటన ద్వారా తెలిపారు. జిల్లాలో 70 వేల హెక్టార్లలో రైతుకు ఐదు ఎకరాల చొప్పున రూ.15 వేలు సబ్సిడీ ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లాలోని రైతులు ఆయా మండలాల్లో వ్యవసాయ అధికారులను సంప్రదించాలని కోరారు.

Similar News

News March 12, 2025

నెల్లూరు: ANMల కౌన్సెలింగ్ వాయిదా

image

నెల్లూరు జిల్లాలో సచివాలయం ఏఎన్ఎంలు (గ్రేడ్-3)గా పనిచేస్తున్న 289 మందికి ఎంపీహెచ్ఏ(ఎఫ్)గా ఇటీవల ఉద్యోగోన్నతి కల్పించారు. వీరికి సబ్ సెంటర్ల కేటాయింపునకు సంబంధించి మార్చి 13న నిర్వహించాల్సిన కౌన్సెలింగ్ ప్రక్రియ వాయిదా పడింది. 17న నిర్వహిస్తామని వైద్య ఆరోగ్య శాఖ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ సుచిత్ర తెలిపారు. సీనియారిటీ సమస్యలు ఉత్పన్నం కాకుండా జోన్ పరిధిలోని జిల్లాల్లో ఒకే రోజు నిర్వహిస్తున్నామన్నారు.

News March 12, 2025

డా.N. యువరాజ్‌కు నెల్లూరు జిల్లా బాధ్యతలు

image

నెల్లూరు జిల్లా ప్రత్యేకాధికారిగా డా.N.యువరాజ్ IAS నియమితులయ్యారు. ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పర్యవేక్షిస్తారు. పాలన పక్కాగా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలతో కూడిన జోన్‌కు ప్రత్యేక అధికారిగా మొవ్వ తిరుమల కృష్ణబాబు వ్యవహరిస్తారు.

News March 12, 2025

CBI అంటూ రూ.1.02 కోట్ల లూటీ 

image

CBI అధికారులమంటూ నెల్లూరుకు చెందిన ఓ విశ్రాంతి ఉద్యోగి నుంచి రూ.1.02కోట్లు దోచేసిన ఘటన కలకలం రేపింది. బాధితుడికి గత నెల 25న ట్రాయ్ అధికారులంటూ కొందరు ఫోన్ చేశారు. మీ సిమ్‌పై 85 ఫిర్యాదులు ఉన్నాయని, పలు నేరాలకు సిమ్‌ను వినియోగించారంటూ బెదిరించారు. మరో వ్యక్తి సీబీఐ అధికారినంటూ అతని ఖాతా నుంచి రూ.1,02,47,680ను వివిధ ఖాతాల్లో జమ చేయించారు. దీంతో బాధితుడు వేదాయపాలెం PSలో ఫిర్యాదు చేశాడు.

error: Content is protected !!