News February 2, 2025
నేటి నుంచే చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు
చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి 9వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ మేరకు అధికారులు భక్తులకు వసతులు, ఆలయానికి రంగులు, పారిశుద్ధ్యం, మంచినీటి వసతిలో ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఏర్పాట్ల పనులలో నిమగ్నమై ఉన్నారు. ఈసారి జాతరకు సుమారుగా 12 లక్షల వరకు భక్తులు రావచ్చని అంచనా వేశారు.
Similar News
News February 2, 2025
నూతన చట్టాలతో బాధితులకు సత్వర న్యాయం: ఎస్పీ గిరిధర్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన నేరన్యాయ చట్టాలు-2023 ద్వారా దర్యాప్తును వేగవంతంగా చేయడంతో పాటు బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని వనపర్తి ఎస్పీ గిరిధర్ అన్నారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలంగాణ పోలీసు లీగల్ అడ్వైజర్, రిటైర్డ్ పీపీ రాములుతో నూతన చట్టాలపై అవగాహన కల్పించారు. ప్రజలకు సత్వర సేవలు అందించడానికి నూతన చట్టాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
News February 2, 2025
NZB: 12 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ
నిజామాబాద్ నగరంలోని RTC కాలనీ శక్తిమాన్ హనుమాన్ మందిర్ వద్ద 12 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆదివారం ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి, 3 వ డివిజన్ కార్పొరేటర్ చింత శ్రీనివాస్, చిటికల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రజలు, హనుమాన్ భక్తులు, కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకున్నారు.
News February 2, 2025
శ్రీకాకుళం: మార్చి 3తేదీ వరకు గ్రీవెన్స్ రద్దు
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున మార్చి 3 తేదీ వరకు గ్రీవెన్స్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక – గ్రీవెన్స్) వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం తెలిపారు. సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ నిర్వహణ తేదీని ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని జిల్లాలోని అన్ని మండలాల ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని వెల్లడించారు.