News February 25, 2025
నేటి మంచిర్యాల జిల్లా టాప్ న్యూస్

◼️రైలు కిందపడి కాసిపేట యువకుడి సూసైడ్
◼️ భీమినిలో రోడ్డుప్రమాదం.. యువకుడి మృతి
◼️MLC ఎన్నికల్లో BJP, BRS కుమ్మక్కయ్యాయి: సీతక్క
◼️మంచిర్యాల: నీలగిరి ప్లాంటేషన్లో పెద్దపులి సంచారం
◼️వేలాలలోని కిరాణా షాపులకు నోటీసులు
◼️బుగ్గ జాతరకు ప్రతి 10నిమిషాలకు ఒక బస్సు
Similar News
News December 14, 2025
కుంకుమను ఇంట్లోనే తయారు చేసుకోండిలా..

మార్కెట్లో దొరికే నకిలీ కుంకుమతో చర్మ సమస్యలు రావొచ్చు. అయితే ఇంట్లోనే సహజంగా కుంకుమను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం పసుపు, సున్నం ఉంటే చాలు. ముందుగా ఆర్గానిక్ పసుపు తీసుకోవాలి. అందులో చిటికెడు సున్నం వేయాలి. ఆ తర్వాత నాలుగైదు చుక్కల నీళ్లు పోసి బాగా కలపాలి. సున్నం వేయడం వల్ల ఆ మిశ్రమం ఎరుపు రంగులోకి మారుతుంది. ఈ మిశ్రమాన్ని ఎండలో ఆరబెడితే పొడిగా మారి, నాణ్యమైన కుంకుమ తయారవుతుంది.
News December 14, 2025
మెస్సీ వెంట ఉన్న ప్లేయర్ల గురించి తెలుసా?

ఫుట్బాల్ స్టార్ మెస్సీతో, ఇద్దరు ప్లేయర్లు రోడ్రిగో డిపాల్(అర్జెంటీనా), లూయిస్ సువారెజ్(ఉరుగ్వే) భారత పర్యటనలో ఉన్నారు. వీరు US మేజర్ లీగ్ సాకర్ క్లబ్ ఇంటర్ మయామికి ప్రాతినిధ్యం వహిస్తుండటం గమనార్హం. మిడ్ ఫీల్డర్ అయిన రోడ్రిగో(RHS).. 2022లో ఫిఫా వరల్డ్కప్ గెలిచిన అర్జెంటీనా జట్టులో సభ్యుడు. మరో ప్లేయర్ సువారెజ్(LHS) స్ట్రైకర్గా పేరొందారు. యూరప్ లీగ్లో 2 సార్లు గోల్డెన్ బూట్ గెలుచుకున్నారు.
News December 14, 2025
KMR: ఉత్కంఠ పోరు.. GP పీఠం కోసం నానా తంటాలు!

కామారెడ్డి జిల్లాలో జరుగుతున్న 2వ విడత GP ఎన్నికలు పలు చోట్ల అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. అత్యంత రసవత్తరంగా సాగుతున్న ఈ పోరులో అభ్యర్థులు విజయం కోసం నానా తంటాలు పడుతున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్నదైనా, పెద్దదైనా గ్రామ పంచాయతీ పీఠాన్ని దక్కించుకోవడానికి అభ్యర్థులు చేస్తున్న ఖర్చు, అనుసరిస్తున్న వ్యూహాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.


