News April 10, 2024

నేడు గోదావరి జిల్లాల్లో చంద్రబాబు, పవన్ పర్యటన

image

AP: TDP అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇవాళ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ప.గో జిల్లా తణుకులో సా.4గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం తూ.గో జిల్లా నిడదవోలులో రాత్రి 7 గంటలకు నిర్వహించే సభలో రాష్ట్ర BJP చీఫ్ పురందీశ్వరితో కలిసి పాల్గొననున్నారు. రేపు డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తారు. సా.4 గంటలకు అంబాజీపేట సభలో, రాత్రి 7కి అమలాపురం సభలో ప్రసంగిస్తారు.

Similar News

News October 10, 2024

TATA: పెళ్లి చేసుకోకపోవడానికి మరో కారణం..!

image

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా పెళ్లి చేసుకోకుండా ఉండటానికి మరో బలమైన కారణం ఉందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. తన చిన్నప్పుడే తండ్రి నావల్ టాటా నుంచి తల్లి సోనో విడిపోయారు. తన నానమ్మ నవాజ్ బాయ్ వద్దే ఆయన పెరిగారు. కొంతకాలానికి ఆయన తల్లి రెండో పెళ్లి కూడా చేసుకున్నారు. దీనిపై టాటాను స్కూళ్లో తోటి విద్యార్థులు అవహేళన చేసేవారు. ఆ అవమానాలే ఆయన వివాహం చేసుకునేందుకు అడ్డు వచ్చాయని అంటారు.

News October 10, 2024

నాలుక కోసుకుని దుర్గామాతకు సమర్పించిన భక్తుడు!

image

దుర్గామాతపై భక్తిని చాటుకునేందుకు ఓ వ్యక్తి అవాంఛిత చర్యకు పూనుకున్నాడు. మధ్యప్రదేశ్‌లోని బింద్ జిల్లా లాహర్ నగర్‌లో రతన్‌గఢ్ దేవీ ఉత్సవాల్లో రామ్ శరణ్ పాల్గొన్నాడు. అనంతరం తన నాలుకను తెగ్గోసుకుని అమ్మవారికి సమర్పించి, రక్తాన్ని అక్కడి పాత్రలో పోశాడు. ఇది చూసిన స్థానికులంతా నివ్వెరపోయారు. ఈ ఘటన తర్వాత రామ్ కాసేపు ఆలయంలోనే నిద్రించి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
– ఎవ్వరూ ఇలాంటి చర్యలకు పాల్పడవద్దు.

News October 10, 2024

రేపు ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీ

image

రితీశ్ రాణా దర్శకత్వంలో సింహా, సత్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మత్తు వదలరా-2’ చిత్రం రేపు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ‘మత్తు వదలరా’కి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 13న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.