News February 6, 2025

నేడు విజయవాడకు మంత్రి లోకేశ్

image

విజయవాడకు గురువారం మంత్రి లోకేశ్ రానున్నారు. ఉదయం 9.30 గంటలకు సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజ్‌లో హ్యాక్‌థాన్ ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా మంత్రి నారా లోకేశ్ పాల్గొంటారు. వివిధ సంస్థల నుంచి 1300 మంది మేధావులు హాజరుకానున్నారు. ఏఐలో స్వర్గీయ నందమూరి తారకరామారావు మాట్లాడనున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Similar News

News February 6, 2025

 బాపట్ల: ‘ఆక్వా రైతులు ఇన్సూరెన్స్ చేయించుకోవాలి’

image

ఆక్వా రైతులు తమ చెరువులకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని బాపట్ల జిల్లా మత్స్యశాఖ అధికారి కృష్ణ కిషోర్ తెలిపారు. గురువారం కర్లపాలెం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆక్వా ఇన్సూరెన్స్‌పై రైతులకు అవగాహన కల్పించారు. ఆక్వా రైతులు నష్టపోయిన పరిస్థితులలో ఇన్సూరెన్స్ వారికి అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ అధికారులు, మండలంలోని ఆక్వా రైతులు పాల్గొన్నారు.

News February 6, 2025

సిరిసిల్ల: చేనేత ఐక్యవేదిక ఉపాధ్యక్షుడిగా గోనె ఎల్లప్ప

image

తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడిగా సిరిసిల్ల పట్టణానికి చెందిన గోనె ఎల్లప్పను నియమిస్తున్నట్లు అధ్యక్షుడు రాపోలు వీర మోహన్ గురువారం తెలిపారు. ఈ మేరకు సిరిసిల్ల పట్టణంలో గురువారం ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎల్లప్ప మాట్లాడుతూ.. చేనేత రంగానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తన నియామకానికి సహకరించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు స్పష్టం చేశారు.

News February 6, 2025

BNGR: చిక్కనంటున్న బాహుబలి దున్న.. డ్రోన్‌తో వేట

image

యాదాద్రి జిల్లాలో జనావాసాల మధ్య అడవి దున్న సంచరిస్తుండడంతో జిల్లా వాసులంతా భయపడుతున్నారు. ఇటీవల ఆత్మకూరు ఎం మండలం పల్లెల శివారులో కనిపించిన అడవి దున్న.. ఉదయం చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు శివారులో ప్రత్యక్షమైంది. స్థానికుల సమాచారంతో అటవీశాఖ అధికారులు దున్న కోసం డ్రోన్ సహాయంతో గాలిస్తున్నారు. అడవి దున్నను పట్టుకోవడంలో అటవీశాఖ అధికారులు కొంత విఫలమవుతున్నారని పలువురు మండిపడుతున్నారు.

error: Content is protected !!