News April 9, 2024
నేతన్నల పోరాట ఫలితమే: బండి సంజయ్
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం చాలా సంతోషం అని ఎంపీ బండి సంజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. వస్త్ర పరిశ్రమ ఆసాములు, నేతన్నలంతా ఐక్యంగా చేసిన పోరాటాల ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఈ విషయంలో నేతన్నలకు అండగా నిలిచిన బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు.
Similar News
News October 9, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.1,44,849 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,00,714, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.27,915, అన్నదానం రూ.16,220,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.
News October 9, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ వేములవాడలో వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు. @ వేములవాడ బతుకమ్మ వేడుకలలో పాల్గొన్న ఆది శ్రీనివాస్, బండి సంజయ్. @ ఇల్లంతకుంట మండలంలో అంబులెన్స్ బోల్తా ఇద్దరికీ తీవ్ర గాయాలు. @ కేశవపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ. @ హిజ్రాలకు కౌన్సిలింగ్ ఇచ్చిన మల్యాల ఎస్ఐ. @ మెట్ పల్లి మండలంలో అంగన్వాడీల బతుకమ్మ సంబరాలు.
News October 8, 2024
డబుల్ డోస్తో నాని మూవీ: శ్రీకాంత్ ఓదెల
డబుల్ డోస్తో నాని మూవీ ఉంటుందని డైరెక్టర్ ఓదెల శ్రీకాంత్ పేర్కొన్నారు. మంగళవారం చీకురాయిలో మాజీ జడ్పీటీసీ బండారు రామ్మూర్తి డైరెక్టర్ శ్రీకాంత్ను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. తన తదుపరి చిత్రంతో నానితో ఉంటుందన్నారు. దసరాను మించిన యాక్షన్ ఎంటర్టైనర్గా చిత్రం ఉండనుందని ఆయన తెలిపారు.