News March 19, 2025

నేను పార్టీ మారలే.. BRSలోనే ఉన్నా: మహిపాల్ రెడ్డి

image

‘నేను పార్టీ మారలేదు, కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. BRSలోనే కొనసాగుతున్నా’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. MLAల అనర్హత పిటిషిన్‌పై ఈనెల 25న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ నేఫథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సుప్రీం జారీ చేసిన నోటీసులకు గానూ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వివరణ ఇచ్చారు.

Similar News

News March 19, 2025

IPL అభిమానులకు పోలీసుల సూచన!

image

ఉప్పల్ స్టేడియంలో ఆదివారం నుంచి IPL మ్యాచులు జరగనున్నాయి. ఈక్రమంలో స్టేడియంలోకి తేకూడని వస్తువులను పోలీసులు సూచించారు. ‘కెమెరాలు& రికార్డింగ్ పరికరాలు, బ్లూటూత్ హెడ్‌ఫోన్స్ & ఎయిర్‌పాడ్స్, సిగరెట్, అగ్గిపెట్టె, కత్తులు, గన్స్, వాటర్ & ఆల్కహాల్ బాటిల్స్, పెట్స్, తినుబండారాలు, బ్యాగ్స్, ల్యాప్‌టాప్స్, సెల్ఫీ స్టిక్స్, హెల్మెట్, బైనాక్యులర్, టపాసులు, డ్రగ్స్’ వంటివి తీసుకురాకూడదని పోలీసులు తెలిపారు.

News March 19, 2025

పశువుల షెడ్డులో 12 అడుగుల గిరినాగు..!

image

మాడుగులలో బుధవారం 12 అడుగుల భయంకరమైన గిరినాగు హల్ చల్ చేసింది. మాడుగుల మోదమాంబ కాలనీలో కనక అనే మహిళ ఈ గిరినాగును తన పశువుల షెడ్డులో చూసి భయాందోళన చెంది కుమారుడు గణేశ్‌కు విషయం చెప్పింది. దీంతో గణేశ్ స్నేక్ క్యాచర్ వెంకటేశ్‌కు సమాచారం ఇవ్వడంతో చాకచక్యంగా ఈ గిరి నాగును బంధించారు. ఈ గిరినాగును వంట్లమామిడి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని స్నేక్ క్యాచర్ వెంకటేశ్ తెలిపారు.

News March 19, 2025

HYDలో అచ్చంపేట యువకుడి ఆత్మహత్య 

image

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం చేదురుబావి తండాకు చెందిన మూడవత్ బాలు నాయక్ హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు. బతుకుదెరువు కోసం కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటూ జీవనం సాగిస్తున్నాడన్నారు. ఆర్థిక ఇబ్బందులు, దానికి తోడు కుటుంబ కలహాలతో బాలు నాయక్ ఈరోజు ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

error: Content is protected !!