News March 30, 2024

నేను లోకల్ వ్యక్తినే: డాక్టర్ పీవీ పార్థసారథి

image

ఆదోని MLA టికెట్ కూటమి బీజేపీ అభ్యర్థి డాక్టర్ పీవీ పార్థసారథికి ఖరారు అయిన విషయం తెలిసిందే. నియోజకవర్గంలో నాయకులు ఆయనను నాన్ లోకల్ అన్న విమర్శకు కౌంటర్ ఇచ్చారు. తాను లోకల్ వ్యక్తినే అని గత 10 ఏళ్లుగా ఇక్కడ డెంటల్ క్లినిక్ నిర్వహిస్తున్నానని అన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యలు తనకు బాగా తెలుసు అన్నారు. నాయకులు వారి రాజకీయ స్వలాభం కోసం చేస్తున్న విమర్శలు తన విజయాన్ని ఆపలేవు అన్నారు.

Similar News

News October 6, 2024

చిన్న చెరువులో మృతదేహం లభ్యం

image

అవుకు రిజర్వాయర్ సమీపంలోని చిన్న చెరువులో శనివారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. జీఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా నీటి ప్రవాహానికి మృతదేహం కొట్టుకొని వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహం గుర్తుపట్టలేనంతగా కూళ్లిపోయి ఉందని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News October 6, 2024

రేపటి నుంచి యూనివర్సిటీలకు దసరా సెలవులు

image

కర్నూలు జిల్లాలోని యూనివర్సిటీలకు దసరా సెలవులు ప్రకటించారు. రాయలసీమ, డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీలకు ఈనెల 7 నుంచి 13వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు ఆయా వర్సిటీల రిజిస్ట్రార్లు డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ వీ.లోకనాథ తెలిపారు. 14వ తేదీ తిరిగి పునఃప్రారంభమవుతాయని వారు పేర్కొన్నారు.

News October 6, 2024

రహదారులను వేగవంతంగా పూర్తి చేయండి: కలెక్టర్

image

నేషనల్ హైవే రహదారులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం నేషనల్ హైవే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్‌హెచ్ 40 భూ సేకరణకు సంబంధించిన నష్ట పరిహారం వెంటనే పంపిణీ చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్‌హెచ్ 340సీకి సంబంధించి బీ.తాండ్రపాడు నుంచి గార్గేయపురం వరకు ఔటర్ రింగ్ రోడ్డు పనులను నవంబర్ 15 నాటికి పూర్తి చేయాలన్నారు.