News February 14, 2025
నేలకొండపల్లి: అప్పుల బాధతో రైతు బలవన్మరణం

అప్పుల బాధ భరించలేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని మంగాపురం తండాలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తేజావత్ రామ(50) తనకున్న నాలుగు ఎకరాలకు తోడు మరికొంత కౌలుకి తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. పంట పెట్టుబడికి అప్పు చేశాడు.. ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో, అప్పు తీర్చే మార్గం లేక ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు.
Similar News
News December 15, 2025
అన్నమయ్య జిల్లాలో మరికొందరు సీఐల బదిలీ

అన్నమయ్య జిల్లాలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. డి.రామాంజనేయుడును అన్నమయ్య SC, ST సెల్ నుంచి ప్రొద్దుటూరు త్రీటౌన్కు బదిలీ చేశారు. టి.మధును అనంతపురం రేంజ్ సర్కిల్ నుంచి DPTC అన్నమయ్యకు, అక్కడ ఉన్న . ఆదినారాయణ రెడ్డిని DCRB, అన్నమయ్యకు బదిలీ చేశారు. ఎం.తులసి రామ్ను DCRB నుంచి వీఆర్కు పంపారు.
News December 15, 2025
WGL: రెండో విడత జీపీ ఎన్నికల్లో పార్టీల వారీగా గెలుపులు!

ఉమ్మడి జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిపత్యం సాగింది. మొత్తం 563 జీపీల్లో 332 స్థానాల్లో కాంగ్రెస్, 181లో BRS, 9 బీజేపీ, 41 చోట్ల స్వతంత్రులు విజయం సాధించారు. జిల్లాల వారీగా HNK కాంగ్రెస్ 39, బీఆర్ఎస్ 22, WGL కాంగ్రెస్ 70, బీఆర్ఎస్ 40, JNG కాంగ్రెస్ 26, బీఆర్ఎస్ 38, BHPL కాంగ్రెస్ 46, బీఆర్ఎస్ 30, MLG కాంగ్రెస్ 36, BRS 13, MHBD కాంగ్రెస్ 115, BRS 38 స్థానాలు గెలిచాయి.
News December 15, 2025
కర్నూలు రేంజ్ పరిధిలో 31 మంది సీఐల బదిలీ

కర్నూలు రేంజ్ పరిధిలోని 31 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 18 మంది సీఐలకు స్థానచలనం కల్పించారు. పరిపాలన సౌలభ్యం, సమర్థవంతమైన పోలీస్ వ్యవస్థ నిర్వహణ దృష్ట్యా ఈ బదిలీలు చేపట్టినట్లు డీఐజీ తెలిపారు.


