News April 7, 2024

ప.గో.: ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీ విజయం.. ఈ సారి..?

image

చింతలపూడిలో రాజకీయం ఆసక్తిగా మారింది. ఇక్కడ వైసీపీ సిట్టింగ్ MLA ఎలీజాను కాదని కొత్తఅభ్యర్థి కంభం విజయరాజుకు ఆ పార్టీ అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. కూటమి నుంచి సైతం టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిని కాదని కొత్త అభ్యర్థి సొంగా రోషన్‌ను ప్రకటించింది. అయితే నియోజకవర్గ ఓటర్లు 2009, 14, 19 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలకు అధికారం కట్టబెడుతూ వచ్చారు. మరి ఈ సారి ఎవరికి అవకాశమిస్తారో చూడాలి.

Similar News

News April 3, 2025

ప.గో: జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి..కలెక్టర్

image

ఈ ఆర్థిక సంవత్సరంలో ఎన్ఆర్‌జీఎస్ పనుల లక్ష్యాలకు మించి సాధించి రాష్ట్రంలోనే జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. జిల్లాలో 1,81,101 జాబ్ కార్డులు నమోదు కాబడ్డాయన్నారు. 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో 39 లక్షల పని దినాలు లక్ష్యం కాగా 37.71 లక్షల పని దినాలు కల్పించి 96.69 శాతానికి పైగా లక్ష్యం సాధించి పని కోరిన 1,02,792 కుటుంబాలకు పని కల్పించడం జరిగిందన్నారు.

News April 2, 2025

ప.గో: ఇంటర్ సెకండియర్ క్లాసులు ప్రారంభం

image

నూతన విద్యా విధానంలో భాగంగా ఇంటర్ సెకండ్ ఇయర్ క్లాసులు జిల్లాలో ముందస్తుగా మంగళవారం ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 23 వరకు తరగతులు జరుగుతాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి నాగేశ్వరరావు తెలిపారు. సమ్మర్ హాలీడేస్ అనంతరం తిరిగి జూన్ 2న మళ్లీ తరగతులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఇటు ఫస్టియర్ ప్రవేశాలు ఈ నెల 7 నుంచి మొదలవుతాయి. ఆ తర్వాత వారికీ తరగతులు ప్రారంభిస్తారు.

News April 2, 2025

భీమవరంలో వృద్ధురాలిపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

image

భీమవరం పట్టణంలోని ఈ నెల 28న అమ్మిరాజు తోటలో దొంగతనం కేసులో పట్టణానికి చెందిన నిందితుడు విట్టర్ పాల్‌ను సీఐ నాగరాజు తన సిబ్బందితో కలిసి చాకచక్యంగా పట్టుకున్నారు. డీఎస్పీ జై సూర్య తెలిపిన వివరాల ప్రకారం.. వృద్ధురాలు మంగతాయారు ఇంటికి వెళ్లి దగ్గర బంధువునని చెప్పి 3 గంటల పాటు విట్టర్ కబుర్లు చెప్పాడు. ఆమె భర్త బయటకు వెళ్ళగానే వృద్ధురాలిపై బ్లేడుతో దాడి చేసి బంగారాన్ని దొంగిలించాడు.

error: Content is protected !!