News March 15, 2025
ప.గో: నెత్తురోడిన రహదారులు.. ఐదుగురు మృతి

శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందడం ఆయా కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. తాడేపల్లిగూడెం వద్ద హైవేపై వేగంగా వచ్చిన కారు ఆగిఉన్న లారీని ఢీకొట్టగా చిన్నారితో సహా తల్లిదండ్రులు <<15760017>>మృతి చెందారు.<<>> కృష్ణా(D) ఘంటలసాల(M) జీలగలగండిలోని హైవేపై <<15755822>>లారీని బోలెరో ఢీకొన్న<<>> ఘటనలో ప్రాతాళ్లమెరకకు చెందిన వర ప్రసాద్, శివకృష్ణ చనిపోయారు. నిద్రమత్తే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.
Similar News
News March 18, 2025
ప.గో జిల్లాకు కొత్త అధికారి

ప.గో జిల్లా DMHOగా డాక్టర్ జి. గీతాబాయి నియమితులయ్యారు. ఈ మేరకు ఆమెను నియమిస్తూ.. స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎం. కృష్ణబాబు సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. పూర్వ డీఎంహెచ్వో డా. మహేశ్వరరావు గత ఏడాది డిసెంబరులో పదవీ విరమణ చేయగా.. అప్పటి నుంచి డా. బానూనాయక్ బాధ్యతలు చూసుకుంటున్నారు. గీతాబాయి నేడు బాధ్యతలు చేపట్టనున్నారు.
News March 18, 2025
ప.గో : మహిళపై అత్యాచారం

అత్యాచారంపై న్యాయం చేయాలని ఆమె, కుటుంబీకులు సోమవారం ఏలూరు ఐజీ జీవీజీ అశోక్ కుమార్కు ఫిర్యాదు చేశారు. ఉండికి చెందిన తనపై రవి, సోమేశ్వరరావు పలుమార్లు అత్యాచారం చేసి, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి రూ.2.30 లక్షలు తీసుకున్నారని ఆరోపించింది. ఉండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే భర్త, మరిదిపై కౌంటర్ కేసు పెడతామని బెదిరించినట్లు తెలిపారు. విచారణ అధికారిగా ప.గో జిల్లా SPని నియమించినట్లు సమాచారం.
News March 18, 2025
ప. గో: ప్రయోగాత్మకంగా గుర్రపు డెక్కతో వర్మీ కంపోస్ట్

జిల్లాలో ప్రయోగాత్మకంగా గుర్రపు డెక్కతో వర్మీ కంపోస్ట్ రూపొందించడానికి చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. సోమవారం భీమవరం జిల్లా కలెక్టరేట్లో డీఆర్డీఏ, వ్యవసాయ, ఇరిగేషన్, డీపీవో, టూరిజం శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. గుర్రపు డెక్కతో వర్మీ కంపోస్ట్ రూపొందించడంపై చర్చించారు. గుర్రపు డెక్కతో ఆర్నమెంటల్ వస్తువులను కూడా రూపొందించేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు.